గౌతమ్ రాజు ఇటీవల తెలుగులో వర్క్ చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా.. ‘రేసుగుర్రం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150’ చెప్పవచ్చు. దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడం గౌతమ్ రాజు ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈయన ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడంటే.. దర్శక నిర్మాతలు భరోసాగా ఫీలవయ్యేవారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటర్ గా నంది అవార్డును అందుకున్నారు.