పేరెంట్స్ లేని సమయంలో సుధీర్ ని ఇంటికే పిలిపించుకుంటున్న రష్మీ... ఫోన్ సంభాషణతో  గుట్టురట్టు!

First Published Jul 15, 2021, 10:39 AM IST

బుల్లితెర ఎవర్ గ్రీన్ జంటగా సుధీర్, రష్మీ కొనసాగుతున్నారు. దాదాపు ఐదేళ్లకు పైగా వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. సుధీర్, రష్మీ లవ్ బర్డ్స్ అనేది అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. పైకి మాత్రం స్నేహితులమే అని చెబుతారు. మరి వీళ్లిద్దరి రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి చేరినట్లు వీరి తాజా ఫోన్కాల్ సంభాషణ ద్వారా తెలిసింది.

జబర్దస్త్ వేదికగా సుధీర్, రష్మీలకు పరిచయం ఏర్పడింది. స్కిట్స్ లో భాగంగా రష్మిపై సుధీర్ పంచ్ లు విసురుతూ ఉండేవాడు. అలాగే రష్మీ కూడా సమయం దొరికినప్పుడు సుధీర్ పై తన మార్క్ పంచ్ లతో విరుచుకుపడేది.
undefined
కామెడీ పంచే వీరి గిల్లికజ్జాల వెనుక ఏదో దాగుందని ప్రేక్షకులు భావించారు. కాలం గడిచే కొద్దీ వీరి బంధం మరింత గట్టిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాలలో లవ్ కపుల్ గా వీరిని చూపించడం జరిగింది. ఆ షోలకు మంచి రెస్పాన్స్ దక్కడంతో బుల్లితెరపై రష్మీ సుధీర్ హాట్ ఫేవరేట్ జోడి అయ్యారు.
undefined
రష్మీ-సుధీర్ లకు బుల్లితెరపై అనేక మార్లు వివాహం కూడా జరిగింది. ఉత్తిత్తి పెళ్లి అయినప్పటికీ వధూవరులుగా సుధీర్, రష్మీ వేడుకలలో మురిసిపోయేవారు. దీనితో సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వస్తూ ఉంటాయి.
undefined
కాగా తాజా ఢీ ఎపిసోడ్ లో మరోమారు తమ మధ్య ఉన్న రిలేషన్ రుజువయ్యేలా ప్రవర్తించారు ఈ జంట. ఇంట్లో ఎవరూ లేరని, నువ్వు వెంటనే వచ్చేయాలని రష్మీ సుధీర్ కి కాల్ చేసింది .
undefined
ఇంట్లో ఎవరూ లేరు, రమ్మంటున్నావంటే అర్థం ఏమిటని... సుధీర్ అనగా, నువ్వు ఫస్ట్ సోది ఆపి వెంటనే రావాలని డిమాండ్ చేసింది. దానికి సుధీర్ నువ్వు నన్ను ఇలా పదే పదే పిలుస్తూ ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నాడు.
undefined
డీ వేదిక సాక్షిగా సాగిన వీరి మొబైల్ సంభాషణ, నిజంగా వీరిద్దరూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా కలుస్తారా అనే సందేహాలు ఏర్పరిచింది.
undefined
ఢీ జోడీలో కొనసాగుతున్న మరో జంట దీపికా పిల్లి, హైపర్ ఆది మధ్య ఈ తరహా సంభాషణే సాగింది. నాన్నగారు ఇంట్లో లేరు వస్తావా అని దీపికా అడుగగా, వెంటనే వచ్చేస్తా అంటూ ఆది సమాధానం చెప్పాడు.
undefined
ఢీ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్-రష్మీ, హైపర్ ఆది-దీపికా పిల్లి ల మధ్య జరిగిన మొబైల్ సంభాషణ జడ్జెస్ తో పాటు, ప్రేక్షకులకు వినోదం పంచింది.
undefined
click me!