తమిళ హీరోకు హైప్ ఇచ్చేందుకు.. తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడిన దిల్ రాజు.. షాకింగ్ కామెంట్స్!

First Published Jan 3, 2023, 10:45 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘వారసుడు’. తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించారు. చిత్ర ప్రమోసన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి  (Vijay Thalapathy) డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వారసుడు’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.
 

ఈ చిత్రం విడుదల విషయంలో థియేటర్ల కోసం ఓవైపు ఇష్యూస్ నడిచిన విషయం తెలిసిందే. ఏపీ, టీఎస్ లో మంచి సెంటర్లు దిల్ రాజ్ పరిధిలోనే ఉండటంతో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం.. రేపు సాయంత్రం 5 గంటలకు చిత్ర ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది.
 

ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ (Dil Raju) మాట్లాడుతూ తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు స్టేట్స్ లో తమిళ స్టార్ విజయ్ ను లేపేందుకు తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

దిల్ రాజు మాట్లాడుతూ.. నేను విజయ్ దళపతి క్యాబిన్‌లో వెయిట్ చేస్తున్నాను. క్యాబిన్ లోకి వచ్చిన విజయ్ స్వయంగా తానే మాకు కాఫీ కప్పులు ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విజువల్ ఇప్పటికీ నా మదిలో ఉంది. తెలుగులో మెగాస్టార్‌లు, సూపర్‌స్టార్‌లతో సినిమాలు చేశాను కానీ అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. 
 

ప్రస్తుతం ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ గా  మారుతున్నాయి. మరోవైపు నటుడు శ్రీకాంత్  కూడా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇది పక్కా తెలుగు సినిమాగే ఉంటుందన్నారు. బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయన్నారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నారు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. 
 

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు.

click me!