ఒకప్పుడు సూర్య, జ్యోతికల కూతురిగా 'నువ్వంటే నాకిష్టం' సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా శర్మ గుర్తుందా? ఇప్పుడు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి ముంబైలో కార్పొరేట్ లాయర్గా స్థిరపడ్డారు. ఆమె ప్రయాణం గురించి ఈ ఫొటో గ్యాలరీలో చూడండి.
తమిళ సినిమా 'సిల్లును ఒరు కాదల్' (2006) తెలుగులో 'నువ్వంటే నాకిష్టం'గా డబ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య, జ్యోతికల కూతురిగా శ్రియా శర్మ నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆమె కెరీర్ మొదలైంది తెలుగులోనే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ'లో ఆయన చెల్లి కూతురిగా నటించి శ్రియా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’, మహేష్ బాబు దూకుడు వంటి భారీ చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. అంతేకాదు, దాదాపు 150కి పైగా టీవీ యాడ్స్లో నటించి అప్పట్లో అందరికీ సుపరిచితమైన ముఖంగా మారింది.
23
సినిమాలకు గుడ్ బై
చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి సక్సెస్ చూసిన శ్రియా శర్మ, హీరోయిన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2015లో 'గాయకుడు', 2016లో 'నిర్మలా కాన్వెంట్' సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా అందంగా ఉన్నా, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. దీంతో శ్రియా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి చదువుపై పూర్తి దృష్టి పెట్టింది. లా పూర్తి చేసి, ఇప్పుడు ముంబైలో ఒక సక్సెస్ఫుల్ 'కార్పొరేట్ లాయర్'గా రాణిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల న్యాయపరమైన వ్యవహారాలను చూసుకుంటోంది.
33
ఆశ్చర్యపోతున్న అభిమానులు
శ్రియా శర్మ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసిన అభిమానులు, "మనం చూసిన ఆ చిన్న పాప ఈమెనా? ఎంత పెద్దదైపోయిందో!" అని ఆశ్చర్యపోతున్నారు. తన లాయర్ వృత్తికి సంబంధించిన అందమైన క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. ఒకప్పుడు కెమెరా ముందు నటించిన ఆ చిన్నారి, ఇప్పుడు కోర్టులో వాదిస్తోంది. సినిమానే జీవితం కాదు, ఇతర రంగాల్లోనూ రాణించవచ్చని శ్రియా శర్మ నిరూపించింది. ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.