స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ తనయ శృతి హాసన్.. ఈ ఏడాది ఒకేసారి రెండు హిట్లు అందుకుంది. సంక్రాంతికి ఆమె చిరంజీవితో `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాల్లో నటించింది. ఈ ఇద్దరితోనూ మొదటిసారి యాక్ట్ చేసింది. రెండు బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో రెండు సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతుంది.