శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. యుఎస్ నుంచి ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి చిన్న బాబుకి తల్లిదండ్రులుగా నటిస్తున్నారు.