గేమ్ ఛేంజర ప్రీరిలీజ్ లో శంకర్ మాట్లాడుతూ.. తాను తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలి అనుకున్నాను అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో, ప్రభాస్ తో, మహేష్ బాబుతో ఇలా ముగ్గురితో విడిగా సినిమాలు చేసే ప్రయత్నం చేశారట శంకర్.
అంత కాదు ప్రభాస్ తో కథా చర్చలు కూడా జరిగాయట. కాని అవేవి వర్కౌట్ అవ్వలేదట. ఇక తనకు సినిమాచేయాలని రామ్ చరణ్ తో రాసి పెట్టి ఉంది. అది జరిగింది అన్నారు శంకర్. ప్రస్తుతం శంకర్ మాటలు వైరల్ అవుతున్నాయి. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమౌతుందో చూడాలి.