ఇందులో సమంత, విజయ్ కలిసి అనేక రహస్యాలను బయటకు తీస్తారు. అసలు శంకరయ్య ఎవరనేది వెలికితీస్తుంటారు. సావిత్రి జీవితంలోని విషాదకర అంశాలను బయటపెట్టి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. చివరల్లో శంకరయ్య ఫోటోని సావిత్రి చేతిలో పెట్టడం, ఆ టైమ్లో వచ్చే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇలాంటి స్క్రీన్ప్లే ఆ సినిమాకే హైలైట్గా నిలిచింది. నాగ్ అశ్విన్ బ్రిలియన్సీకి అద్దం పట్టింది. మరోవైపు ఇందులో సమంత, విజయ్ దేవరకొండల మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే కామెడీ, వారి కెమిస్ట్రీ మరో హైలైట్గా నిలిచింది.