సమంత చైతూ విడాకులు రూమర్స్: భరణం క్రింద అక్కినేని ఫ్యామిలీ సమంతకు  ఇస్తుంది ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

First Published Sep 22, 2021, 6:40 PM IST

గత కొన్ని వారాలుగా, నటి సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడాకుల పుకార్లు వార్తల్లో ఉన్నాయి. ఆమె తన సోషల్ మీడియా ఖాతా ల నుండి 'అక్కినేని'ని తొలగించడంతో ఇదంతా ప్రారంభమైంది.

ఇక సమంత, చైతూ గచ్చిబౌలీ లోని నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు, ఇద్దరూ ఎవరి పేరెంట్స్ తో వాళ్ళు ఉంటున్నారని సమాచారం. కెరీర్ ప్రణాళిక భాగంగా సమంత తన మకాం ముంబైకి మార్చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 
 


అలాగే మామ నాగార్జున బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన సమంత, తన మిత్రులతో పాటు గోవా టూర్ కి వెళ్లారు. ఈ టూర్ లో నాగ చైతన్య లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. 


ఇక మీడియా కథనాల ప్రకారం సమంత, చైతన్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారట. అలాగే కౌన్సిలింగ్ కూడా హాజరయ్యారట. ఫలితం మాత్రం శూన్యం కాగా, విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత, చైతూ విడాకులకు అప్లై చేశారట. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని, ఈ లోపు ఎటువంటి కామెంట్స్ చేయకూడదని భావిస్తున్నారట. 


మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే... సమంత భరణం క్రింద చైతన్య నుండి రూ. 50 కోట్లు తీసుకోనున్నారట. ఈ జంట అక్టోబర్ 07, 2017 న గోవాలో  వివాహం చేసుకున్నారు. వారు హిందూ మరియు క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 

ఇక ఇవన్నీ రూమర్స్ మాత్రేమే కాగా, దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. సమంత సోషల్ మీడియా పోస్ట్స్, ప్రవర్తన ఆధారంగా ఈ కథనాలు వెలువడుతున్నాయి. 

click me!