సాయిపల్లవి ఇటీవల `విరాటపర్వం` చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్గా ఆదరణ పొందలేకపోయింది. ఆటైమ్లో సాయిపల్లవి ప్రమోషన్లో భాగంగా `కాశ్మీర్ ఫైల్స్` గురించి, మనుషుల హత్యలను, గోహత్యలకి సంబంధించిన ఎదురైన ప్రశ్నకి ఆమె స్పందించారు. మనుషుల హత్యలు చేస్తున్నారని, మనిషి ప్రాణాలు విలువైనవని తెలిపారు. గోహత్యలను, మనుషుల హత్యలకు పోలిక పెట్టడంపై పలువురు రాజకీయ నాయకులు, కొన్ని మత సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో ఇది వివాదంగా మారింది. మరోవైపు దీనిపై సాయిపల్లవి వేసిన పిటిషన్ కూడా కోర్ట్ కొట్టేసింది.