ఇంటర్వెల్ తర్వాత RRR లో ఆటంబాంబ్.. ప్రభాస్ ని పిలుద్దామా, ఆఫ్ ది రికార్డ్ లో బయట పడ్డ సీక్రెట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 18, 2022, 01:57 PM IST

ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఆఫ్ ది రికార్డు ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక సీక్రెట్స్ బయట పడ్డాయి.   

PREV
17
ఇంటర్వెల్ తర్వాత RRR లో ఆటంబాంబ్.. ప్రభాస్ ని పిలుద్దామా, ఆఫ్ ది రికార్డ్ లో బయట పడ్డ సీక్రెట్స్

యావత్ దేశం సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న రాజమౌళి తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేస్తూ సినిమాకి హైప్ మరింత పెంచుతున్నారు.  మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది. అంటే ఇక వారం రోజులోనే ఆర్ఆర్ఆర్ థియేటర్స్ లో సందడి చేయనుంది. తాజాగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఆఫ్ ది రికార్డులో సరదాగా ఓ ఇంటర్వ్యూ జరిగింది. 

27
RRR Movie

ఈ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ త్రయం తమ మూడున్నరేళ్ల కష్టం, సంతోషాలు, రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల ప్లానింగ్ గురించి చర్చించుకున్నారు. వీరి మధ్య జరిగిన చర్చలో సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. ముందుగా సినిమా రిలీజ్ రోజున ప్రీమియర్స్ కి ఎలా ప్లాన్ చేసుకుందాం అని చర్చించుకున్నారు. 

37

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జక్కన్న ప్రీమియర్స్ కి గెస్ట్ గా ప్రభాస్ ని పిలుద్దామా అని అడిగాడు. ప్రభాస్ వస్తాడా.. అది జరగని పని అని రాజమౌళి అన్నారు. ఏముంది చరణ్ పిలుస్తాడులే అని ఎన్టీఆర్ అనగా.. ఇద్దరం పిలుద్దాం అని రాంచరణ్ అన్నారు. అది జరగని పని అని రాజమౌళి అంటారు. 

47

అలా వీరి మధ్య చర్చ కొనసాగుతూ.. షూటింగ్ సమయంలో ఎలా కష్టపడ్డారో.. రాజమౌళి ఎలా టార్చర్ పెట్టారో, షూటింగ్ లో తాము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నింటి గురించి మాట్లాడుకున్నారు. జంతువులని గ్రాఫిక్స్ లో చూపించినప్పుడు అది ఫేక్ అని ఈజీగా తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండడానికి ఈ చిత్రంలో కొత్త టెక్నిక్ ఉపయోగించినట్లు రాజమౌళి తెలిపారు. 

57

సాధారణంగా నటీనటుల హావభావాలు షూట్ చేసి దానికి తగ్గట్లుగా జంతువులని యానిమేషన్ చేస్తాం. కానీ ఈ చిత్రంలో ముందుగా జంతువులని యానిమేట్ చేసి ఆ తర్వాత నటీనటుల పెర్ఫామెన్స్ తీసుకున్నట్లు రాజమౌళి తెలిపారు. వాటర్ పైపులు గాల్లోకి ఎగరడం లాంటి సన్నివేశాలు అద్భుతం అని చర్చించుకున్నారు. 

 

67

ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశంకి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఎవ్వరూ కనీసం సీట్ లో నుంచి అటు ఇటు కదలడం, కను రెప్ప ఆర్పడం లాంటివి ఏమీ ఉండవు. అలా చూస్తూ ఉండడమే అని ఎన్టీఆర్ అన్నారు. ఆ సీన్ లో మొదటి 13 నిముషాలు ఒకెత్తయితే.. చివరి రెండు నిమిషాల్లో మీరు నటించిన విధానం మరో ఎత్తు అని రాజమౌళి అన్నారు. 

77

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎన్టీఆర్ జీడిపప్పు ఉప్మాతో పోల్చారు. సాధారణంగా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో అప్పుడప్పుడు జీడిపప్పు వస్తుంటే ఇంకా బావుంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ జీడిపప్పు కాదు.. అది ఆటంబాంబ్ అని రాజమౌళి అన్నారు. 

click me!

Recommended Stories