ప్రతీ ఆరోపణకు సమాధానం చెప్పిన రియా.. సుశాంత్ మృతిని జోక్‌ చేశారంటూ ఆవేదన

First Published Aug 28, 2020, 11:44 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ఇప్పుడు ఆయన గర్ల్‌ ప్రెండ్‌ రియా చక్రవర్తి చుట్టూనే తిరుగుతుంది. కొద్ది రోజులుగా రియాను టార్గెట్‌ చేస్తూ చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై నోరు విప్పింది రియా. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలపై స్పందించింది.

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న తనను సుశాంతే మాట్లాడమని కోరాడని చెప్పింది రియా చక్రవర్తి. సుశాంత్ తన కలలో వచ్చి అసలు నిజమేంటో చెప్పాలని సూచించాడని చెప్పింది.
undefined
2013లో సుశాంత్‌తో పరిచయం అయ్యిందన్న రియా చక్రవర్తి 2015లో ఓ పార్టీలో క్లోజ్‌ అయ్యామని చెప్పింది. ఆ తరువాత ఆ బంధం ప్రేమగా మారిందని చెప్పింది. ముందుగా సుశాంతే తనకు ప్రపోజ్ చేశాడన్న రియా, తాను మాత్రం రెండు మూడు నెలల తరువాత ఓకే చెప్పాడని చెప్పింది.
undefined
తాను సుశాంత్ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కారణమేంటో క్లియర్‌గా చెప్పింది. జూన్‌ 2, 3 తారీఖుల నుంచే సుశాంత్ తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని తరుచూ చెప్పేవాడని చెప్పింది. అయితే ఆ సమయంలో తాను కూడా మానసికంగా అనారోగ్యంగా ఉన్నానని ఆరోగ్యం కుదట పడగానే వెళ్లిపోతానని చెప్పానని చెప్పింది. జూన్‌ 8న తన సోదరి వస్తుందని ఆమె వచ్చేలోగా వెళ్లిపోవాలని చెప్పాడని చెప్పింది.
undefined
బ్రేకప్‌ తరువాత మహేష్ భట్‌కు మెసేజ్‌చేయటం పై కూడా క్లారిటీ ఇచ్చింది. తన బాధను షేర్ చేసుకున్నానని, మహేష్ తనను కూతురిలా చూస్తాడని,కాని అంతా మా మధ్య ఏదో రిలేషన్‌ ఉన్నట్టుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మహేష్ భట్‌ కూతురు వయసు తన వయసు ఒకటే అని, అలాంటి మా గురించి తప్పుగా మాట్లాడటం ఎంతో బాధించిందని చెప్పింది.
undefined
జూన్‌ 8న ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత జూన్‌ 9న సుశాంత్ తనకు మెసేజ్‌ చేశాడని, తన ఆరోగ్యం బాలేదు కనుగు ఎలా ఉన్నావు బెబూ అంటూ మెసేజ్‌ పెట్టాడని, కానీ కోపంలో ఉన్న తాను సుశాంత్‌ నెంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పింది. ఆ తరువాత రోజు తన సోదరుడు షోవిక్‌ కాల్ చేసిన సుశాంత్ తన గురించి అడిగి తెలుసుకున్నాడని చెప్పింది.
undefined
అంతా ఆరోపిస్తున్నట్టుగా సుశాంత్‌కు సంబంధించిన 15 కోట్లు తాను ఖర్చు చేయలేదని అది నిరూపించేందుకు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. అసలు సుశాంత్ అకౌంట్‌లో 15 కోట్లు లేవని, ఓ సినిమాకు సంబంధించ 15 కోట్ల రూపాయలకు మౌఖికంగా మాత్రమే ఓకే అనుకున్నారని, అందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ గానీ, అడ్వాన్స్‌లు ఇవ్వటం కానీ జరగలేదని చెప్పింది.
undefined
యూరప్‌ ట్రిప్‌కు సంబంధించి కూడా కీలక విషయాలను చెప్పింది రియా. తాను పారిస్‌లో షూటింగ్‌ వెళుతున్న సమయంలోనే సుశాంత్ యూరప్‌ ట్రిప్‌ ప్లాన్ చేశాడని, అందుకే తనకు కంపెనీ వేసిన టికెట్స్‌ను క్యాన్సిల్ చేసి మరి తాను టికెట్స్ బుక్‌ చేశాడని చెప్పింది. గతంలోనూ 6 గురు అబ్బాయిలతో సుశాంత్ ఇలాంటి ట్రిప్‌కు వెళ్లాడని, సుశాంత్ కు లగ్జరీ లైఫ్‌ గడపటం ఇష్టం కనుకే అలా చేసేవాడని చెప్పింది.
undefined
సుశాంత్ కంపెనీ లావాదేవీల్లో తాను అవకతవకలకు పాల్పడినట్టుగా వచ్చిన ఆరోపణలకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది. కేవలం తలా 33 వేలతో రియాలిటిక్స్‌ కంపెనీ ప్రారంభించామని అయితే ఆ కంపెనీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదని, ఏ లావాదేవీలు జరగలేదని తెలిపింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఈడీకి, ముంబై పోలీసులకు అందించినట్టుగా చెప్పింది.
undefined
డ్రగ్స్‌ విషయం గురించి మాట్లాడుతూ తనకు చెప్పటం ఇష్టంలేకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పలేదని సుశాంత్‌కు డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్టుగా చెప్పింది. అయితే సుశాంత్‌కు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా వినే వాడు కాదని, సుశాంత్ తనకు నచ్చింది తాను చేసే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది.
undefined
సుశాంత్ మానసిక పరిస్థితి గురించి కూడా ఆమె కీలక విషయాలు వెల్లడించింది. సుశాంత్ తల్లి కూడా మానసిక సమస్యలతోనే చనిపోయిందని, సుశాంత్ 2013 నుంచే డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడని చెప్పింది. అప్పట్లో ట్రీట్ చేసిన డాక్టర్‌ పేరు కూడా వెల్లడించింది రియా చక్రవర్తి.
undefined
సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఏంటో తాను చెప్పలేనన్న రియా, తన వల్లే అయిన తను బయటకు వచ్చిన వెంటనే జరిగి ఉండాలి, నేను వచ్చిన తరువాత వారం రోజులకు సుశాంత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటాడని చెప్పింది. ఈ వారంలో ఏం జరిగిందో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని, అందుకే తాను సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశానని చెప్పింది.
undefined
click me!