సిస్టర్స్ కి చరణ్ సర్ప్రైజింగ్ ట్రీట్... ఆనాటి రుణం అలా తీర్చుకున్న ఆర్ ఆర్ ఆర్ అల్లూరి!

First Published Aug 30, 2021, 1:40 PM IST

మెగా హీరో రామ్ చరణ్ సిస్టర్స్ సుస్మిత, నిహారిక, శ్రీజలకు సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చారు. వాళ్ళను సరదాగా లంచ్ కి తీసుకెళ్లారు. సిస్టర్స్ తో చరణ్ ఫోటోలు బయటికి రావడంతో వైరల్ గా మారాయి. 
 

ఈనెల 22న రాఖీ పూర్ణిమ సందర్భంగా మెగా డాటర్స్ శ్రీజ, సుస్మిత, నిహారిక.. బ్రదర్ చరణ్ కి రాఖీలు కట్టారు. ఒకరికి ఒకరు మిఠాయి తినిపించుకుని, ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఇక రాఖీ కట్టిన సిస్టర్స్ కి బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుండో ఉన్న ఆనవాయితీ. అయితే చరణ్ ఆరోజు రాఖీలు కట్టిన సిస్టర్స్ కి ఎటువంటి ట్రీట్ ఇవ్వలేకపోయారట. 

 అదే రోజు చిరంజీవి బర్త్ డే కావడంతో పాటు, ఆర్ ఆర్ ఆర్ మూవీపనుల్లో బిజీగా ఉండడం వలన సిస్టర్స్ కి ఏమీ చేయలేకపోయారట. 

కాగా నిన్న సండే కావడంతో పాటు, చరణ్ కి సమయం దొరకడంతో సిస్టర్స్ ని తీసుకొని అలా సరదాగా లంచ్ కి వెళ్లారట చరణ్. ఓ ఖరీదైన హోటల్ లో ప్రియమైన సిస్టర్స్ కి మాంచి ట్రీట్ ఇచ్చారట. 

ఇక సిస్టర్స్ తో లంచ్ కి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చరణ్ అక్క సుస్మిత నిర్మాతగా మారి, సినిమాలు, సిరీస్లు తెరకెక్కిస్తున్నారు.

చిరంజీవి చిన్న కూతురు, చరణ్ చెల్లెలు శ్రీజ మొదట ప్రేమ వివాహం చేసుకొని ఓ సాధారణ వ్యక్తితో వెళ్లిపోయారు. ఆ వివాహం బంధం విడాకులతో ముగియగా... రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ ని చేసుకున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా మారిన విషయం తెలిసిందే. 

ఇక నిహారిక గత ఏడాది డిసెంబర్ లో వెంకట నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె ఆక్టింగ్ ని కొనసాగిస్తున్నారు. 

విజయ్ సేతుపతితో చేసిన ఓ మూవీ విడుదల కావాల్సి ఉండగా, ఓ తెలుగు వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. 

click me!