టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్నా..హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
undefined
ఇటీవల తెలుగులోనూ ఈ అమ్మడికి విజయాలు లేవు. దీంతో ఎక్కువగా బాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న రకుల్ తాజాగా మరో హిందీఆఫర్ని దక్కించుకుంది.
undefined
బిగ్బీ అమితాబ్ బచ్చన్తో కలిసి పనిచేసే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. ఫస్ట్ టైమ్లో అమితాబ్తో కలిసి పనిచేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది.
undefined
అజయ్ దేవగన్ దర్శకత్వంలో వహిస్తూ `మేడే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్ పోషిస్తున్నారు. అజయ్ దేవగన్ దర్శకత్వంతోపాటుఫైలర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ని ఎంపిక చేశారట. ఇందులో ఆమె కో పైలట్గా కనిపించనుందని టాక్.
undefined
దీనిపై రకుల్ మాట్లాడుతూ, `అమితాబ్ బచ్చన్ సర్తో కలిసి ఏదో ఒక రోజు పనిచేయాలని అందరిలానే నేను కూడా ఎన్నో కలలు కన్నాను. `మేడే` చిత్రంతో ఆ కల నిజంకాబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సినిమాను వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారని టాక్.
undefined
రకుల్ ఇప్పటికే అజయ్తో `దే దే ప్యార్ దే` చిత్రంలో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో `చెక్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు కమల్ హాసన్ `భారతీయుడు 2`లోనటిస్తుంది. హిందీలో అర్జున్ కపూర్తో ఓ సినిమా చేస్తుండగా, మరో సినిమాకి సైన్ చేసింది. ఇప్పుడు `మేడే`లో మెరవబోతుంది.
undefined