లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో పూరి జగన్నాధ్ ని నమ్ముకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ శ్రీను వివాదం ఆల్రెడీ హైలైట్ అయింది. ఇప్పుడు పూరి జగన్నాధ్, ఛార్మి బాధితుల లిస్ట్ లో మరో ప్రముఖులు చేరారు. వాళ్ళు ఎవరో కాదు హను మాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి.