నిర్మాత చెప్పినా వినకుండా ఓ స్టార్ హీరో షూటింగ్ కొనసాగించారు. ఆ చిత్రం ఫ్లాప్ అవుతుంది అని నిర్మాత ముందే చెప్పేశారు. ఆ హీరో ఎవరు ? చివరికి ఆ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ లో క్రేజీ నిర్మాతల్లో ఒకరు. ఆయన నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. మా అన్నయ్య, ఆది, లక్ష్మీ నరసింహా, నా ఆటోగ్రాఫ్, కందిరీగ లాంటి హిట్ చిత్రాలు బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో తెరకెక్కాయి.
25
బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో సూపర్ హిట్ చిత్రాలు
బెల్లంకొండ సురేష్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆది తర్వాత రభస అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రానికి కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
35
ఈ చిత్రాన్ని ఆపేద్దాం అనుకున్నా
షూటింగ్ ప్రారంభం నుంచి ఈ సినిమాపై నాకు నమ్మకం లేదు. సగం మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ఆపేద్దాం అని అనుకున్నా. సినిమాపై నాకు కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఫ్లాప్ అవుతుంది అనిపిస్తోంది అని ఎన్టీఆర్ తో చెప్పా. కానీ ఎన్టీఆర్ నా మాట వినలేదు.
లేదు మూవీ చాలా బాగా వస్తోంది. సినిమా మొత్తం పూర్తయ్యాక మీకు అర్థం అవుతుంది. మధ్యలో చూస్తే సినిమా అర్థం కాదు అని ఎన్టీఆర్ అన్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు మనకెందుకు అని వదిలేశా. నేను అనుకున్నట్లుగానే రభస నిరాశ పరిచింది అని బెల్లంకొండ సురేష్ అన్నారు.
55
ఓపెనింగ్స్ వచ్చాయి
ఎన్టీఆర్ స్టార్ డమ్ వల్ల ఓపెనింగ్స్ కొంత వచ్చాయి కానీ సినిమా అయితే ఆకట్టుకోలేకపోయింది అని తెలిపారు. అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సమంత, ప్రణీత సుభాష్ ఈ మూవీలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేశారు.