టోర్న్ జీన్స్, ట్రెండీ గాగుల్స్... వైరల్ అవుతున్న ప్రభాస్ అల్ట్రా మోడ్రన్ లుక్

First Published Sep 16, 2020, 1:03 PM IST

సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే ప్రభాస్, పబ్లిక్ వేదికలపై కూడా కానరారు. దీనితో ఆయన ఫ్యాన్స్ దర్శనం కోసం ఆసక్తికా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా ప్రభాస్ లేటెస్ట్ లుక్ సంబంధించిన ఫోటో బయటికి రాగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రెండీగా ఉన్న ప్రభాస్ న్యూ లుక్ కేకగా ఉంది. 

పాన్ ఇండియా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే జపాన్, రష్యా, చైనా వంటి దేశాలలో కూడా ప్రభాస్ అంటే బాహుబలి హీరో అనేవారుండారు. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
undefined
బాహుబలి మూవీ జపాన్ లో విశేష ఆదరణ దక్కించుకోగా ప్రభాస్ కి ఫ్యాన్బేస్ ఏర్పడింది. ఇండియా వచ్చిన జపాన్ అమ్మాయిలు ప్రభాస్ ఇంటి ముందు డాన్స్ వేశారంటే ఆయన ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక జపాన్ లోఅత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సాహో టాప్ లో ఉంది. జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సాహో రికార్డులకు ఎక్కింది. అక్కడ సాహో 150రోజులు ఆడడం మరో విశేషం.
undefined
తాజాగా ప్రభాస్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టోర్న్ జీన్స్, రౌండ్ షేప్ గాగుల్స్, లెథర్ జాకెట్ ధరించి ఉన్న ప్రభాస్ లేటెస్ట్ లుక్ ట్రెండీగాఉంది. ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
undefined
ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయరు. తన మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్, కొన్ని ముఖ్యమైన విషయాలపై తప్పితే స్పందించరు. దీనితో ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించడం తక్కువ. పబ్లిక్ వేదికలపై కూడా ప్రభాస్ దర్శనం ఇవ్వరు. అందుకే ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు.
undefined
ఆ మధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం బయటికి వచ్చిన ప్రభాస్ మొక్కలు నాటుతూ కనిపించారు. ఇటీవల ఖాజిపల్లి రిజర్వు ఫారెస్ట్ ని దత్తత తీసుకొని దాని సంరక్షణ బాధ్యతలు తీసుకున్న ప్రభాస్ 2కోట్లు దానం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
undefined
ప్రభాస్ కొద్దిరోజులలో రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొననున్నారు. దర్శకుడు రాధా కృష్ణ షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరక్కుతుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాగ్ అశ్విన్ చిత్రంతో పాటు, ఆదిపురుష్ చిత్రాలు ప్రభాస్ ప్రకటించారు.
undefined
click me!