ప్రభాస్(Prabhas) నటించిన `రాధేశ్యామ్`(Radheshyam) విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లో బిజీగా గడుపుతుంది. ఇప్పటికే ముంబయి, చెన్నైలో ప్రమోషన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేశారు. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ, నటి రిద్దీ, భాగ్యశ్రీ, హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యాయి. తాజాగా సోమవారం యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర, సంగీత దర్శకుడు థమన్, హీరో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రభాస్.