అదేంటంటే.. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే వైఖరి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో వీరిద్దరూ ఎంత దగ్గరగా కనిపించినా.. ఇద్దరి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. పైపైకి మాత్రమే ఇద్దరూ దగ్గరగా ఉన్నారు. చిరునవ్వులు నవ్వుతున్నారు.