పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో నటి పూనమ్ కౌర్ ఆయనకు పలు అంశాల్లో మద్దతుగా నిలుస్తూ, ఇండస్ట్రీలోనూ పవన్పై వచ్చే విమర్శలకు తాను కౌంటర్ ఇస్తూ వచ్చింది. శ్రీరెడ్డి విషయంలోనూ ఆమె స్పందించి హాట్ టాపిక్గా మారింది.
undefined
ఇటీవల పవన్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది పూనమ్. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమె బయటకొచ్చింది. చాలా రోజులుగా సెలైంట్గా ఉన్న ఈ అమ్మడు `వకీల్సాబ్` సినిమాపై ఏపీలో జరుగుతున్న ఘటనలు, థియేటర్ల విషయంలో విధిస్తున్న ఆంక్షలపై ఆమె స్పందించింది.
undefined
`సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిది. ఇది ఒక వ్యవస్థీకృత సంబంధం. ఇది కేవలం కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాలి. కని కాపురం చేయకపోతే ఫీల్ అయ్యేది ప్రజలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి.
undefined
కానీ ఈ డీ ఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు?. అమ్మాయిలను డీఫేమ్ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్ ఎవరికి? పోసానిగారు ప్రెస్మీట్?` అంటూ పేర్కొంది పూనమ్.
undefined
ఇందులో ఆమె నటుడు, పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం మరింత హాట్ టాపిక్గా మారింది. వైసీపీకి మద్దతుగా పోసాని పలు మార్లు ప్రెస్మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ ఆయన్ని దీనిపై మాట్లాడాలని ఇరికించడం గమనార్హం. మరి పోసాని స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి.
undefined
ఈ నెల 9న విడుదలైన పవన్ కళ్యాణ్ `వకీల్సాబ్` సినిమాకి బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో, `వకీల్ సాబ్`కి లేకుండా ఈ అవకాశాలు ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వ అధికారులు హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయి.
undefined
ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సినిమా విడుదలైన తొలి ఆట తర్వాత కొందరు 'వకీల్సాబ్' సినిమాను `డిజాస్టర్ వకీల్సాబ్` అంటూ ట్రోల్స్ చేశారు. దీనికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఇది గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూనమ్ స్పందించి కామెంట్ చేయడం, పోసానిని ఇరికించడం ఎలాంటి రచ్చకు దారితీస్తుందో చూడాలి.
undefined
`మాయాజాలం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ భామ పూనమ్ కౌర్ `ఒక వీ చిత్రం`, `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్`, `గగనం`, `ఆడు మగాడ్రా బుజ్జి`, `ఎటాక్`, `నెక్ట్స్ ఏంటి` వంటి చిత్రాల్లో హీరోయిన్గా, ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
undefined
మరోవైపు `వకీల్సాబ్` సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం సుదర్శన్ థియేటర్లో సందడి చేసింది.
undefined