చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపుపై మరోసారి ట్రోలింగ్.. ఈసారి ఎందుకు అంటున్నారంటే?

First Published Apr 11, 2024, 7:38 PM IST

తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు (Avantika Vandanapu) వరుసగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఆమె చేసిన తప్పేమీ లేకున్నా మరోసారి పలు విమర్శలను ఎదర్కొంటోంది.

ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు. ఇంగ్లీష్ లో ఆమె నటించిన ఒక్కో చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

చివరిగా ‘మీన్ గర్ల్స్ - ది మ్యూజికల్’ (Mean Girls The Musical) అనే చిత్రంతో అలరించింది. ఈ మూవీ ఓటీటీ వేదికన విడుదలైంది. అవంతిక నటనకు ప్రశంసలు కూడా అందాయి. మీన్ గర్ల్స్ కు కూడా పాజిటివ్ టాక్ దక్కింది.

అయితే ఈ చిత్ర ప్రమోషన్ సమయంలో ఆమె ఇంగ్లీష్ యాసకు పలువురు ట్రోల్ చేశారు. ఇప్పుడు నెక్ట్స్ ఆమె నటించబోయే చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ అందగా.. మళ్లీ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

అవంతిక వందనపు నెక్ట్స్ చేయబోయే సినిమాలో డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ ‘రపుంజెల్’ పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే ఆ పాత్రలో తెల్లగా ఉన్న వారే నటించాలని, ఈవె వద్దు అంటూ ఆమె స్కిన్ కలర్ పై ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీలో ఆమె నటిస్తుందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడే ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఆమెపై మరోసారి జరుగుతున్న ట్రోల్ ను అభిమానులు కొందరు నెటిజన్లు ఖండిస్తున్నారు. 

అలాంటి కామెంట్లు చేయొద్దని అభిప్రాయపడుతున్నారు. తెలుగు నటిగా హాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న ఆమెకు మద్దతుగా నిలవాలంటున్నారు. ఇక అవంతిక మహేశ్ బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. తర్వాత ‘ప్రేమమ్, రారండో వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్నాతవాసి’ వంటి చిత్రాల్లో నటించింది.

click me!