తమిళ బ్యూటీ నివేదా థామస్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. విభిన్న కథలతో అలరిస్తున్న ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గానే వెండితెరపై అలరించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. అయితే హీరోయిన్ గా మలయాళం చిత్రం ‘మధ్య వేనల్’తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నివేదా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. చెన్నైలోని తన కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. చెన్నైలోనే తన ఎడ్యూకేషన్ ను పూర్తి చేసింది. ఆ తర్వాత సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే హీరోయిన్ గా మాత్రం ‘మలయాళం’లోనే కేరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో నివేదాకు ఓ మలయాళ యంగ్ హీరోతో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది.
కొన్నాళ్ల తర్వాత ఇంట్లో వారితో చెప్పి ఆ హీరోను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పిందంటూ అప్పట్లో మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదంట. ఆ హీరో క్యాస్ట్ వేరు కావడంతో వద్దంటే వద్దంటూ నివారించారంట. అతన్ని పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ సూసైడ్ కూడా చేసుకుంంటామని హెచ్చరించారంట. దీంతో నివేదా తన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి, అతని బ్రేక్ చెప్పేసిందంట.
అత్యాధునిక యుగంలోనూ క్యాస్ట్ పేరుతో ప్రేమ వివాహాలను అడ్డుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నివేదా కూడా ఈ సమస్యను ఎదుర్కొవడం ఆమె ఫ్యాన్స్ ను బాధిస్తోంది. ఏదేమైనా నివేదా ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది.
ప్రస్తుతం నివేదా సౌత్ ఇండస్ట్రీలో వరుస పెట్టి ఆఫర్లను అందుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని సరసన ‘జెంటిమెన్’లో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
‘జెంటిమెన్’ తర్వాత తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. నివేదాకు ఇక్కడి ఆడియెన్స్ ను మంచి ఎంకరేజ్ మెంట్ ఇవ్వడంతో విభిన్న కథలను ఎంచుకుంటూ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. తను నటించే చిత్రాల ఫలితం ఎలాగున్న నివేదాకు మాత్రం మంచి పేరే వస్తుంది. దీంతో మరిన్ని అవకాశాలను అందుకుంటోంది.
ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘షాకినీ ఢాకినీ’ (Saakini Daakini). మూవీలో హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 16న చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మూవీ ప్రమోషన్స్ ను నివేదా, రెజీనా క్రేజీగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక నివేదా కొన్నేండ్ల తర్వాత మళ్లీ మలయాళ చిత్రం ‘ఎంతడ సాజి’లో నటిస్తోంది.