గ్రాండ్‌గా సుధీర్‌-రష్మీ, హైపర్‌ ఆది-దీపికా పిల్లి వెడ్డింగ్‌.. మ్యారేజ్‌లేనా? ఫస్ట్ నైట్లు కూడా చేసేయండంటూ..

First Published Jul 10, 2021, 1:17 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, జడ్జ్ లు రోజా, మనోలు వధు వరులు సుడిగాలి సుధీర్‌- రష్మీ, హైపర్‌ ఆది- దీపికా పిల్లిలను వేదికపైగా తీసుకొచ్చారు. గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేశారు. ఏకంగా ఫస్ట్ నైట్‌ చర్చలకు తెరలేపారు. 

`జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. అనసూయ యాంకర్‌గా ప్రసారమయ్యే ఈ షోలో రష్మీ సందడి చేశారు. అంతేకాదు ఏకంగా పెళ్లి కూతురుగా ముస్తాబై వచ్చారు. సుధీర్‌తో పెళ్లి చేసుకున్నారు.
undefined
`ఢీ` జోడీలైనా సుడిగాలి సుధీర్‌ రష్మీని పెళ్లి చేసుకుంటే, హైపర్‌ ఆది దీపికా పిల్లిని పెళ్లి చేసుకున్నారు. అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, రోజా, మనోలు కలిసి దగ్గరుండి వీరి మ్యారేజ్‌ తంతుని గ్రాండ్‌గా నిర్వహించారు. సంప్రాదాయ పద్దతిలో మ్యారేజ్‌ పూర్తి చేసేశారు.
undefined
రాత్రి పది అయింది ఇంకా ఏం లేదా? అన్నాడు సుడిగాలి సుధీర్‌. నన్ను కాదు, హైపర్‌ ఆదిని అడుగూ అంటుంది రష్మీ. ఆయన్ని అడిగితే బాగోదన్నది రోజా. ఆద్యంతం నవ్వులు కురిశాయి. హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ల మ్యారేజ్‌ స్కిట్లు ఆద్యంతం రక్తికట్టింది.
undefined
undefined
నెక్ట్స్ వీక్‌ ప్రసారం కానున్న ఈ జబర్దస్త్ ప్రోమో అబ్బురపరుస్తుంది. తెగ ఆకట్టుకుంటుంది. సుధీర్‌, రష్మీ మధ్య, ఆది, దీపికాల మధ్య వచ్చే ఏ సన్నివేశమైనా బాగా రక్తికడుతుంది.డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రెచ్చిపోతూ కామెడీని పంతున్నారు.
undefined
ఇది నాణేనికి ఓ వైపు.. రెండో వైపు కూడా ఉంది. అది ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. `జబర్దస్త్` షో మాత్రమే కాదు, దీన్ని నిర్వహకులు మల్లెమాల ప్రొడక్షన్‌ని సైతం ఘాటు విమర్శల పాలవుతుంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్రోమో చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
undefined
ఇటీవల కాలంలో `జబర్దస్త్` షోలో, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షో, `ఢీ` షోస్‌లో మ్యారేజ్‌ల గోల ఎక్కువైపోయిందని, స్కిట్లు బాగా పండుతున్నాయని వరుసగా మ్యారేజ్‌ స్కిట్లు వేస్తున్నారని, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు వరుసగా బ్యాక్‌ టూ బ్యాక్‌ అవే స్కిట్లతో బోర్‌ కొట్టించడమే కాదు పరమ రోత పుట్టిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
undefined
ఇప్పటికే `జబర్దస్త్` షోలో అనేక సార్లు సుధీర్‌కి, రష్మీకి పెళ్లి స్కిట్లు ప్రదర్శించారు. వీరితోపాటు ఇతర కంటెస్టెంట్లకి కూడా మ్యారేజ్‌లు చేశారు. ఇటీవల ఇమ్మాన్యుయెల్‌, వర్షల చేత కూడా వేయించారు. `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో ఈ ఇద్దరి మధ్య మ్యారేజ్‌ స్కిట్‌ బాగా ఆదరణ పొందింది.
undefined
ఇలాంటి మ్యారేజ్‌ స్కిట్లకి బాగా రేటింగ్‌ వస్తోన్న నేపథ్యంలో గ్యాప్‌ లేకుండా మ్యారేజ్‌ స్కిట్లని ప్రదర్శిస్తున్నారు మల్లెమాల ప్రొడక్షన్‌. దీంతో అదిప్పుడు అనేక విమర్శలను ఎదుర్కోవల్సి వస్తుంది. షోకి మూలమైన ఈ సంస్థపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
undefined
`మల్లెమాల ప్రొడక్షనా` లేక మ్యారేజ్‌ బ్యూరోనా, పెళ్లిళ్లు సెట్‌ చేసే బ్రోకరా?, మల్లెమాల నెమ్మదిగా మ్యారేజ్‌ బ్యూరోగా మారుతుంది. ప్రతి వారం మ్యారేజ్‌లు చేయకుంటే బతికేలా లేరు, మీ టీఆర్‌పీల కోసం ఇంతటి దారుణానికి తెగబడతారా?, సింగిల్‌గా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు మల్లెమాలకు వెళ్లండి వాళ్లే పెళ్లిళ్లు చేస్తారంటూ విమర్శలతోపాటు సెటైర్లతో రెచ్చిపోతున్నారు.
undefined
కామెడీ పంచడానికి బదులు పెళ్లిళ్లు చేస్తున్నారని, ఇక మున్ముందు ఫస్ట్ నైట్లు కూడా పెడతారేమో అంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే ఇదేనా అంటూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడి ఇంటర్నెట్‌లో హాట్‌ హాట్‌ చర్చకి తెరలేపుతుంది.
undefined
నిజానికి ప్రారంభంలో జబర్దస్త్త్‌ పై డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ ల విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ కలిసి చూసే పరిస్థితి లేదని, టీఆర్‌పీ కోసం ఇలా చేస్తున్నారని అనేక విమర్శలువచ్చాయి. క్రమంగా అవి తగ్గి ఫ్యామిలీ మొత్తం షోని చూడటం మొదలు పెట్టారు. దీంతో బాగా సక్సెస్‌ అయ్యింది. దాదాపు ఎనిమిదేళ్లుగా విజయవంతంగా రన్‌ అవుతుంది.
undefined
ఇటీవల కాలంలో మాత్రం `మల్లెమాల` నిర్వహించే షోస్‌ అన్నింటిలోనూ మ్యారేజ్‌ స్కిట్లు ప్రదర్శించడం, సుధీర్‌-రష్మీ, హైపర్‌ ఆది-దీపికా పిల్లి, ఇమ్మాన్యుయెల్‌-వర్షల మధ్య లవ్‌,రొమాన్స్‌ ని జోడించి ఆకర్షించడం చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మొత్తానికి లేటెస్ట్ `జబర్దస్త్` ప్రోమోమాత్రం కొత్త వివాదాలకు తెరలేపుతుందని చెప్పొచ్చు. ఈ షో వచ్చే గురువారం ప్రసారం కానుంది.
undefined
click me!