కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.