తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్యఉన్న గురు శిష్యుల బంధం గురించి తెలిసిందే.
undefined
విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన `శుభలేఖ`, `ఆపద్భాంధవుడు`, `స్వయంకృషి` వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారుచిరంజీవి. ఈ సినిమాలన్నీ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలవడం విశేషం. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
undefined
మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరని నిరూపించాయి వారికాంబినేషన్లో వచ్చిన సినిమాలు.
undefined
తనని క్లాస్ అండ్ క్లాసికల్ హీరోగా నిలబెట్టిన దర్శకనాథుడు కె.విశ్వనాథ్గారిని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. ఇండస్ట్రీ పెద్దస్థాయిలో తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ మనస్సులో ఆనంద క్షణాలు చిగురించాయి. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్,విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
undefined
ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాథ్ అభిమానుల్లోనూ దీపావళీ సంతోషాన్ని నింపింది.దర్శకులు కె.విశ్వనాథ్ సినిమాలకు ప్రపంచ సినిమా స్థాయి ఉన్న విషయం మనకు తెలిసిందే.
undefined
విశ్వనాథ్ని కలిసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, విశ్వనాథ్ గారిని కలవాలనిపించి ఈ రోజు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాకి గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా దీపావళిశుభాకాంక్షలు` అని అన్నారు.
undefined
కె.విశ్వనాథ్ దంపతులనుకలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
undefined
కె.విశ్వనాథ్ దంపతులనుకలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుం
undefined
కె.విశ్వనాథ్ దంపతులనుకలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుం
undefined
కె.విశ్వనాథ్ దంపతులనుకలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుం
undefined