Janaki Kalaganaledu: జ్ఞానాంబకు రామ సలహా.. విష్ణు మనసు మార్చే ప్రయత్నంలో మల్లిక!

Published : Oct 18, 2022, 12:05 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
17
Janaki Kalaganaledu: జ్ఞానాంబకు రామ సలహా.. విష్ణు మనసు మార్చే ప్రయత్నంలో మల్లిక!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి, రామతో ఈ విషయం మనం అత్తయ్య గారికి చెప్పకూడదు మళ్ళీ వాళ్ళు బాధపడతారు వాళ్లకు తెలియకుండా డబ్బులు దాయాలి అని అంటుంది. ఇందులో జెస్సి వస్తుంది అప్పుడు ఇంటికి బయలుదేరుతాము అని జానకి అనగా, నాకు కొట్టులో పని ఉన్నది జానకి గారు మీరు వెళ్ళండి అని రామా అంటాడు. ఆ తర్వాత సీన్లో మల్లిక తింటూ ఉండగా గోవిందరాజు, జ్ఞానాంబ అక్కడికి వస్తారు. మల్లిక తిండి ఆపేస్తుంది అప్పుడు గోవిందరాజు, అమ్మ మా గురించి నువ్వు తినడం మనక్కర్లేదు.
 

27

 బయటకు నవ్వుతూ మళ్ళీ లోపల తిట్టుకోవడం ఎందుకులే తిను అని అంటాడు.అప్పుడు జ్ఞానాంబ చికితను పిలిచి ఈరోజు నుంచి ఏ పనులైనా నువ్వే చూసుకోవాలి చికిత జానకి అసలు పని చేయడానికి వీలులేదు. తనను చదువుకొనివ్వండి అలాగే తనకు వెళ్లి పాలు ఇవ్వు అని అనగా జానకమ్మ గారు ఇంట్లో లేరు జెస్సి అమ్మ గారిని తీసుకొని బయటికి వెళ్లారు అని చికిత చెప్తుంది. దానికి జ్ఞానాంబ,ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంది. ఇదే మంచి సమయం అని మల్లిక అనుకోని, అత్తయ్య గారు మీ ముందే జానకి చదువుతున్నట్టు నటిస్తుంది.
 

37

 కానీ ఎప్పుడూ మాట్లాడుకోవడమే తప్ప చదువు మీద దృష్టి పెట్టడం లేదు అని అనగా గోవిందరాజు మధ్యలో అడ్డుకొని ఏం మల్లిక ఎప్పుడు చూడు జానకి మీద పడతావ్ ఎందుకు ఏం చదువుకోకపోతే నూటికి నూరు మార్కులు వస్తాయా పరీక్షల్లో అని అంటాడు. ఇంతలో జానకి, జెస్సిలు అక్కడికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు అని జ్ఞానాంబ అడగగా నోట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాము అత్తయ్య గారు అని జానకి అంటుంది. మరి నోట్స్ ఏవి అని మల్లిక అడగగా అక్కడ కొట్టు మూసి ఉన్నది అందుకే నోట్స్ తీసుకొని రాలేదు అని జానకి అంటుంది.

47

 ఇంతలో ఊరివాళ్లు ఇంటికి వచ్చి దసరా మామూలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్లో రామా ఇంటికి వస్తాడు. అమ్మకి ఏమని చెప్పి డబ్బులు దాయాలి అని అనుకుంటూ జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి,అమ్మ ఈ నెల డబ్బులు ఇదిగో అని ఇస్తాడు. దానికి గోవిందరాజు, చూసావా జ్ఞానం మన పిల్లలు ఎంత మంచి వాళ్ళో. వాళ్ళ కోసం రూపాయి కూడా వాడుకోకుండా మన కోసమే అంత ఇచ్చేస్తారు అని అనగా రామా జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి,అమ్మ జానకి గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు.
 

57

 పిల్లలు ఇద్దరు కోసం ఇప్పటినుంచే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరాలకు పనికొస్తాయి కదా అని అనగా,నేను ఆలోచించలేనిది జానకి ఆలోచించింది ఇవి తీసుకొని వెళ్లి బ్యాంకులో పెట్టు అలాగే విష్ణు వస్తాడు తన డబ్బులు కూడా అందులో పెట్టు అని అంటాది జ్ఞానాంబ. అప్పుడు విషయం అంతా జానకికి చెప్పిన రామా ఈ డబ్బులు బీరువాలో పెట్టండి జానకి గారు అని అంటాడు. అప్పుడు మల్లికా ఇది అంతా వీడియో తీసి విష్ణుకు చూపించి చూశారా మీ అన్నగారు వాళ్ల సొంత పనుల కోసం డబ్బులు వాడుకుంటే మీరేమో అంతా మీ అమ్మకి వెళ్లి దారబోస్తున్నారు.
 

67

 మీరు కూడా దాయండి అని అనగా, అలాగే అని విష్ణు అంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం వెన్నెల ఆనందంగా జానకి దగ్గరికి వచ్చి హద్దుకొని ఆ వదిన మీరు నాకు చెప్పడం వల్లే నేను ఎగ్జామ్ లో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను అమ్మ నన్ను పొగిడింది అని అనగా జానకి చాలా ఆనందపడుతుంది.వెన్నెల వెళ్లిపోయిన తర్వాత రామా జానకి తో, మీరు చదువుని పక్కనపెట్టి తనకు చదువు చెప్తున్నారంటే ఏదో కొంచెం బాధగా ఉండేది కానీ తన ఆనందంతో ఆ బాధ తీరిపోయింది అని అంటుంది. ఆ తర్వాత నేను కూడా మీతో బ్యాంకు వస్తాను రామ గారు డిపాజిట్ చేసేద్దామని జానకి అంటుంది. 
 

77

అప్పుడు రామ విష్ణు దగ్గరికి వెళ్లి ,అమ్మ డబ్బు గురించి నీకు ఏమైనా చెప్పిందా అని అనగా లేదు అని విష్ణు కోపంగా అంటాడు. అమ్మ దేవుడి గదిలో ఉన్నది కదా అయితే నువ్వు నీ డబ్బుని ఇస్తే అని రామా అనే లోగా మల్లిక మధ్యలో ఆపి ఆ మేమెందుకు ఇవ్వాలి మీరు మాత్రం బ్యాంకులో మీ అవసరాల కోసం దాచుకోండి మేం మాత్రం మీకు ఇచ్చేయాలని అంటుంది. ఈ మాటలు దేవుడి గదిలో ఉన్న జ్ఞానాంబ వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories