మహేష్ తో నా బంధం అలాంటిది, కాలేజ్ డేస్ లోనే, ఎవరికీ తెలియని రహస్యం బయటపెట్టిన త్రిష!

First Published Sep 17, 2024, 6:47 PM IST

హీరో మహేష్ బాబుతో ఉన్న అనుభంధాన్ని త్రిష ఓ సందర్భంలో గుర్తు చేసింది. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే... కాలేజ్ డేస్ నుండే వారికి పరిచయం ఉందట. 
 

త్రిష-మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ మూవీ. థియేటర్స్ లో పెద్దగా ఆడకున్నప్పటికీ బుల్లితెర పై సంచలనాలు క్రియేట్ చేసింది. స్టార్ మా లో ఎప్పుడు ప్రసారమైన చెప్పుకోదగ్గ టీఆర్పీ అతడు చిత్రానికి వస్తుంది. 

అతడు మూవీలో కామెడీ ట్రాక్స్ అద్భుతంగా ఉంటాయి. త్రిష, మహేష్ బాబు కెమిస్ట్రీ సైతం బాగా కుదిరింది. బావ ప్రేమ కోసం తపించే పల్లెటూరి కొంటె అమ్మాయి పాత్రలో త్రిష నటించి మెప్పించింది. త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. త్రిష కెరీర్ కి అతడు మూవీ ప్లస్ అయ్యింది. 

అతడు అనంతరం సైనికుడు చిత్రంలో మహేష్ బాబు-త్రిష జతకట్టారు. గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మాత్రం నిరాశ పరిచింది. డిజాస్టర్ గా నిలిచింది. మరలా వీరిద్దరూ కలిసి నటించలేదు. కాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబును ఉద్దేశిస్తూ త్రిష ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ తో నటించినప్పుడు నాకు గిల్టీగా అనిపించింది అన్నారు.

Latest Videos


యాంకర్ మహేష్ పై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా.. మహేష్ నాకు ఇష్టమైన హీరోల్లో ఒకరు. అంత పెద్ద సూపర్ స్టార్ అయిన కూడా చాలా గౌరవం ఇచ్చేవారు. చాలా కంఫర్ట్ గా అనిపించేది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... మహేష్ బాబు నాకు చాలా కాలం క్రితమే తెలుసు. 

మహేష్ బాబు కాలేజీ డేస్ లో చెన్నైలోనే ఉన్నారు. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వలన మహేష్ తో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు మేము నటులం అవుతామని మాకు తెలియదు. అయితే హాయ్, బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే. మహేష్ సెట్స్ లో చాలా కష్టపడతారు. ఉదయం నుండి రాత్రి 10 వరకు కూడా సెట్స్ లోనే ఉండేవారు. ఆయన హార్డ్ వర్క్ చూసి నాకు గిల్టీగా అనిపించేది. 

Actress Trisha

కారవాన్ లోకి కూడా వెళ్ళడు. నేను, కమెడియన్స్ ఎవరు నటిస్తున్నా  ప్రతిక్కరి సీన్ మానిటర్ ముందు కూర్చుని గమనిస్తారు, అని చెప్పుకొచ్చింది. మహేష్ బాబును ఇష్టపడని హీరోయిన్ ఎవరుంటారు చెప్పండి. ఇక త్రిష ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. ఆమెకు స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి. 

చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రం చేస్తుంది. ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష-చిరంజీవి జంటగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రం కొరకు జతకట్టారు. 
 

actress trisha krishnan

విశ్వంభర సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సురభి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. విశ్వంభర చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్రిష ఖాతాలో అజిత్ మూవీ సైతం ఉంది. 

మరోవైపు మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి మూవీకి సిద్ధం అవుతున్నారు. ఆయన పొడవాటి జుట్టు, గుబురు గడ్డంలో కనిపిస్తున్నారు. మహేష్ బాబు గతంలో ఎన్నడూ పూర్తి స్థాయిలో గడ్డం పెంచలేదు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ బాబును రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తాడనే చర్చ నడుస్తోంది. 
 

ఈ సినిమా గ్లోబల్  అడ్వెంచర్ థ్రిల్లర్ . ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు  సమాచారం. ఇప్పటికే, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది.ఈ సినిమాలో కథ ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతుందని, ఫారెస్ట్ అడ్వెంచర్ అని చెప్తున్నారు. 

ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంబంధించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, ఆ మేరకు టీమ్ స్కెచ్ వేయిస్తోందని త్వరలోనే ఫైనలైజ్ చేసి కాస్ట్టూమ్స్ డిజైన్ చేయించబోతున్నారట. ఇందుకోసం వందలాది  జూనియర్స్ ఆర్టిస్ట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ ప్రారంభానికి ముందే వారి లుక్స్ ఏమిటనేది లాక్ చేయబోతున్నారు.   

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

click me!