జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న ధనుష్, D52 పై కీలక ప్రకటన!

First Published Sep 17, 2024, 5:36 PM IST

ధనుష్ ఆనతి కాలంలో 50 చిత్రాలు పూర్తి చేశారు. కాగా ఆయన 52వ చిత్రం పై కూడా అధికారిక ప్రకటన వెలువడింది. 
 

ధనుష్ రాయన్

హీరో ధనుష్ దర్శకత్వం వహించి నటించిన 50వ చిత్రం 'రాయన్' విజయం సాధించింది. ధనుష్ జోరు పెంచారు. సైన్ చేసిన చిత్రాలను పూర్తి చేయడమే కాకుండా, దర్శకత్వం పై కూడా ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో తన సిస్టర్ కొడుకు పావిష్ హీరోగా 'నిలవుక్కు ఎన్ మేలే ఎన్నాడి కోబం' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో అనితా సురేంద్రన్ కథానాయికగా నటించగా మాథ్యూ థామస్, ప్రియా వారియర్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు. డిసెంబర్ లో విడుదల కానుంది. 

ఇటీవల నిలవుక్కు ఎన్ మేలే ఎన్నాడి కోబం చిత్రం కోసం ధనుష్ కుమారుడు రాసిన పాట విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ పాటలో ప్రియాంక మోహన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. అలాగే ధనుష్ దర్శకత్వం వహించనున్న నాలుగో చిత్రంపై ప్రకటన వెలువడింది. ఈ చిత్రం ఒక నవల ఆధారంగా ధనుష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ హీరో కాగా,  నటుడు అరుణ్ విజయ్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. హీరోకి దీటుగా విలన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండటంతో ఈ చిత్రంలో అరుణ్ విజయ్ నటించడానికి అంగీకరించారట.
 

Latest Videos


పక్కా యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ మాత్రం దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని వినికిడి. ఈ చిత్రంలో నిత్య మీనన్ కథానాయికగా నటించనుంది. త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధనుష్ 52వ చిత్రం గురించి 'డాన్ పిక్చర్స్' వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?


ఈ ప్రకటనలో, 'డాన్ పిక్చర్స్' బ్యానర్‌లో మా మొదటి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. మా మొదటి నిర్మాణం D52, నటన అసురుడు ధనుష్ నటించనున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు. దీంతో నటుడు ధనుష్ 52వ చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు కావడంతో.. త్వరలో దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటుల వివరాలు వెల్లడి కానున్నాయి.
 

click me!