మహేష్బాబు ఫ్యాన్స్ కి ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆయన సింగిల్ థియేటర్లోకి వచ్చాడు. సడెన్గా తమ మధ్యలోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు తన ఫ్యామిలీతో కలిసి ఆయన థియేటర్లలో సినిమా చూసే ఆడియెన్స్ కి ట్విస్ట్ ఇచ్చాడు.
మహేష్బాబు నటించిన `గుంటూరు కారం` సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అర్థరాత్రి నుంచి సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్బాబు తన ఫ్యామిలీతో కలిసి అభిమానుల మధ్య సింగిల్ థియేటర్లలో సినిమా చూడటం విశేషం. భార్య నమత్ర, పిల్లలు సితార, గౌతమ్లతో కలిసి ఆయన ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో ఈ మధ్యహ్నం షో వీక్షించారు.
ఆయనతోపాటు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, అలాగే దిల్రాజు, వీరితోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, అలాగే నమ్రత సిస్టర్ కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఇలా సూపర్ స్టార్ని, వారి ఫ్యామిలీని చూడటంతో అబిమానులు ఆశ్చర్యపోయారు. అరుపులతో హోరెత్తించారు.
అభిమానులకు మహేష్బాబు అభివాదం తెలిపారు. వారిని కాసేపు ఖుషి చేశాడు. తనదైన మేనరిజంతో ఆయన థియేటర్లలో రచ్చ చేశాడు. అభిమానులు మధ్య సినిమా చూస్తే వాళ్లనుంచి వచ్చే కిక్ని ఆస్వాధించాడు మహేష్.
మహేష్బాబు, శ్రీలీల జంటగా నటించిన `గుంటూరు కారం` చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి చిన్న పాత్రలో మెరిశారు. ప్రకాష్ రాజ్, జయరాం, వెన్నెల కిషోర్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.