స్టార్ హీరోయిన్ విషయంలో నిజం అవుతున్న వేణు స్వామి జోస్యం... నెక్స్ట్ విడాకులేనా?

First Published Jan 12, 2024, 1:26 PM IST


స్టార్ హీరోయిన్ జీవితం వేణు స్వామి చెప్పినట్లే సమస్యల మయంగా మారింది. ఆమె విషయంలో వేణు స్వామి జోస్యం నిజం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 

Venu Swamy


ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల జన్మదినం ఆధారంగా జాతకాలు చెబుతూ ఉంటాడు. ఆయన చేసే కామెంట్స్ కొంచెం వివాదాస్పదంగా ఉంటాయి. అయితే కొందరి విషయంలో ఆయన అంచనాలు కరెక్ట్ అయ్యాయి. సమంత-నాగ చైతన్య విడిపోవడం ఖాయమని వేణు స్వామి ముందుగానే చెప్పారు. 


వేణు స్వామి చెప్పినట్లే పెళ్ళైన నాలుగేళ్లకు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. అలాగే మరికొందరు స్టార్స్ విషయంలో వేణు స్వామి అంచనాలు నిజం అయ్యాయి. కాగా ఓ స్టార్ హీరోయిన్ జీవితంలో కూడా వేణు స్వామి చెప్పినట్లే జరుగుతున్నాయి. 
 

Latest Videos


ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. దర్శకుడు విఘ్నేష్ శివన్ నయనతార 2022లో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట అధికారికంగా పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్ళైన నెలల వ్యవధిలో సరోగసి పద్దతిలో తల్లిదండ్రులు అయ్యారు. నయనతార జాతకరీత్యా విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవని వేణు స్వామి అంచనా వేశాడు. 
 


చివరికి నయనతార-విగ్నేష్ శివన్ విడిపోతారని ఆయన జాతకం చెప్పాడు. వేణు స్వామి చెప్పినట్లే పెళ్లి తర్వాత నయనతారను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. పెళ్ళైన మరుసటి రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు నవదంపతుల వెళ్లారు. శ్రీవారి మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి తిరగడం వివాదాస్పదం అయ్యింది. 


టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. నయనతార దంపతులు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. అనంతరం సరోగసి చట్టాలు అతిక్రమించారని విచారణ ఎదుర్కొన్నారు. పెళ్ళైన నెలల వ్యవధిలో అద్దె గర్భం ద్వారా నయనతార ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. భారతీయ సరోగసి చట్టాలకు ఇది వ్యతిరేకం అని వారిపై విచారణ జరిగింది. 
 

అయితే చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. మేము సరోగసి చట్టాన్ని అతిక్రమించలేదని తగు ఆధారాలు చూపి ఈ సమస్య నుండి బయటపడ్డారు. తాజాగా నయనతార నటించిన అన్నపూరిణి అనే చిత్రం వివాదంలో చిక్కుకుంది. శ్రీరాముడిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హిందూవాదులు ధ్వజమెత్తారు. నెట్ఫ్లిక్స్ నుండి నయనతార చిత్రాన్ని తొలగించారు. 
 

దేశంలో అనేక చోట్ల నయనతార మీద కేసులు నమోదు అయ్యాయి. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీకి ఎల్ ఐ సీ అనే టైటిల్ పెట్టడంపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. మా సంస్థ పేరును పోలిన ఆ టైటిల్ మార్చకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 

ఇవన్నీ గమనిస్తుంటే వేణు స్వామి చెప్పిందే నిజం అవుతుంది. నయనతార దంపతులు వరుస వివాదాలతో సతమతం అవుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో వేణు స్వామి చెప్పినట్లు విడాకులు తీసుకోవచ్చు అంటున్నారు. 

అయితే ఇదంతా ట్రాష్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నయనతార స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. గత ఏడాది జవాన్ మూవీతో భారీ పాన్ ఇండియా సొంతం చేసుకుంది. కాబట్టి ఈ జాతకాలు మూఢనమ్మకం అంటున్నారు. 

click me!