ఇండియన్ సినిమాపై తమదైన ప్రభావం చూపించిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన చివరగా `పొన్నియిన్ సెల్వన్` చిత్రంతో వచ్చారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తి, శోభితా దూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయరాం వంటి భారీ కాస్టింగ్తో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డిజప్పాయింట్ చేసింది. కథ అర్థం కాకపోవడంతో ఆడియెన్స్ కి ఎక్కలేదు. ఇంకా సరళంగా మూవీని తెరకెక్కిస్తే బాగుండేది.