కరోనా ఎఫెక్ట్‌: లెంజెడరీ సింగర్‌ ఇంటికి సీల్!

First Published Sep 1, 2020, 1:14 PM IST

సౌత్‌ ముంబై, పెద్దర్‌ రోడ్‌లోని ప్రభుకుంజ్‌ బిల్డింగ్‌లో 90 ఏళ్ల లతా మంగేష్కర్‌ నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఎక్కువ మంది వృద్ధులు ఉడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని లతా కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.

కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మనదేశంలో కరోన ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా రోజు వందల మంది కరోనతో ప్రాణాలు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
undefined
తాజాగా లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ ఇంటికి బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ సీల్ వేసినట్టుగా అధికారులు వెల్లడించారు. సౌత్‌ ముంబై, పెద్దర్‌ రోడ్‌లోని ప్రభుకుంజ్‌ బిల్డింగ్‌లో 90 ఏళ్ల లతా మంగేష్కర్‌ నివాసం ఉంటున్నారు.
undefined
అయితే ఆ ఇంట్లో ఎక్కువ మంది వృద్ధులు ఉడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని లతా కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. ఈ మేరకు వారు ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు.
undefined
`మా బిల్డింగ్‌ ప్రభుకుంజ్‌కు సీల్‌ వేసినట్టుగా వార్తలు రావటంతో చాలా మంది నిజా నిజాలు తెలుసుకునేందుకు కాల్స్ చేస్తున్నారు. బిల్డింగ్ సోసైటీ, బీఎంసీ ఈ విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరి అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లింగ్‌లో ఎక్కువగా సీనియర్‌ సిటిజెన్స్‌ ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
undefined
అయితే ఆ బిల్డింగ్‌లో నివసిస్తున్న కొంత మంది పాజిటివ్‌ రావటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం లతా మంగేష్కర్, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సురక్షింతగానే ఉన్నట్టుగా వారు తమ ప్రకటనలో వెల్లడించారు.
undefined
click me!