Asha Bhosle Passes Away: సంగీత శకం ముగిసింది.. ఆశా భోస్లే కన్నుమూత

Published : Apr 12, 2026, 01:44 PM IST

ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఏప్రిల్ 12, 2026న గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. తరతరాలకు తన గానంతో స్ఫూర్తినిచ్చిన ఆశాజీ.. తీరని లోటును మిగిల్చి వెళ్లిపోయారు.

PREV
13
ఆశా భోస్లే కన్నుమూత..

ప్రముఖ గాయని.. సంగీత శిఖరం.. ఆశా భోస్లే ఈరోజు తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

ఆమె మరణవార్త తెలియగానే సోషల్ మీడియా, టీవీల్లో ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఎందరికో ఆమె పాటలు కేవలం సంగీతం కాదు, జీవితంలో ఒక భాగం.

23
వయసులోనే కుటుంబ భారం..

ఆశా 1933లో సాంగ్లీలో జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కూడా సంగీత విద్వాంసుడే. ఆయన చిన్న వయసులోనే చనిపోవడంతో, కుటుంబం పుణె, కొల్హాపూర్ మీదుగా ముంబైకి వలస వెళ్లింది.

తన సోదరి లతా మంగేష్కర్‌తో కలిసి, కుటుంబాన్ని పోషించడానికి ఆశా చిన్న వయసులోనే పాడటం మొదలుపెట్టారు. 1943లో తన మొదటి మరాఠీ పాటను రికార్డ్ చేశారు.

33
ఎనిమిది దశాబ్దాల ఆశా సినీ ప్రయాణం..

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఆశా భోస్లే ప్లేబ్యాక్ సింగింగ్‌కు కొత్త అర్థం చెప్పారు. ఆమె క్యాబరే పాటలైనా, రొమాంటిక్ డ్యూయెట్లైనా, గజల్స్ అయినా.. అన్నింటినీ అవలీలగా పాడారు.

ఓ.పి. నయ్యర్, రాహుల్ దేవ్ బర్మన్‌లతో ఆమె పాడిన పాటలు బాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఏ.ఆర్. రెహమాన్‌తో పనిచేసి నేటి తరం ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్, గ్లోబల్ షోలు కూడా చేశారు. ఆమె ఆస్తి విలువ సుమారు రూ. 80-100 కోట్లు ఉంటుందని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories