2010 నుంచి వచ్చిన పాటల్లో వినదగ్గ సాహిత్యం లేదని, పైగా బూతు పాటలు ఎక్కువవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సినిమాలకు పాటలు పాడటం ఆపేశానని తెలిపారు. భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో లతాజీను సత్కరించింది. మూడు జాతీయ అవార్డులు, అనేక ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, ఇతరరాష్ట్రాల అవార్డులు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆమెని వరించాయి.