Jabardasth
జబర్దస్త్ కామెడీ షో మొదట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కారణం అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ జోక్స్ మితిమీరి ఉండేవి. షోకి ఆదరణ దక్కుతున్నప్పటికీ అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దాంతో కమెడియన్స్ కి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక దశ వరకు ఓకే కానీ హద్దులు దాటి అడల్ట్ జోక్స్ రాయవద్దని చెప్పారు. అప్పటి నుండి టీం లీడర్స్ డబుల్ మీనింగ్స్ జోక్స్ తగ్గిస్తూ వచ్చారు.
Jabardasth
సుడిగాలి సుధీర్ టీంలో చాలా వరకు క్లీన్ కామెడీ ఉండేది. హైపర్ ఆది అప్పుడప్పుడప్పుడు డబుల్ మీనింగ్ జోక్స్ వేసినా చాలా వరకు దాని జోలికి వెళ్ళేవాడు కాదు. రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర టీమ్స్ లో కూడా హెల్తీ కామెడీ మనం చూడొచ్చు.
Jabardasth
కొన్నాళ్లుగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యంత ఆదరణ కలిగిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ విచ్ఛిన్నమయ్యాయి. చాలామంది సీనియర్స్ షో నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం యాభై శాతానికి పైగా కమెడియన్స్ కొత్తవారే. ఈ కారణంగా షో కళ కోల్పోయింది. టీఆర్పీ కూడా తగ్గింది.
Jabardasth
కమెడియన్స్ టీఆర్పీ కోసం మరలా అడల్ట్ జోక్స్ ని నమ్ముకుంటున్నారేమో అనిపిస్తుంది. దీనికి జబర్దస్త్ జడ్జెస్ కూడా సహకరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో జడ్జి ఇంద్రజ రెచ్చిపోయారు. సద్దాం టీమ్ మెంబర్ మీద ఆమె దారుణమైన డబుల్ మీనింగ్ పంచ్ వేశారు.
Jabardasth
సద్దాం... తన టీమ్ లో ఉన్న కమెడియన్ ని ఉద్దేశిస్తూ చాలా వేడిలో ఉన్నాడు మేడం అన్నాడు. ఆ మాటకు ఇంద్రజ 'వాళ్ళ ఆవిడ యూఎస్ లో ఉంది కదా, అందుకే ఆ వేడి' అని సమాధానం చెప్పింది. ఆమె పంచ్ కి పక్కన ఉన్న కృష్ణభగవాన్ తో పాటు జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం గట్టిగా నవ్వేశారు.
Jabardasth
మళ్ళీ సద్దాం... సదరు కమెడియన్ ని పెళ్ళాం లేక పాపం పిచ్చోడు అయిపోయాడు అన్నాడు. సంసార సుఖం లేక వేడి మీద ఉన్నాడని అర్థం వచ్చేలా ఇంద్రజ వేసిన డబుల్ మీనింగ్ డైలాగ్ విన్నాక... బూతుల డోసు పెరుగుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాను రాను మరింత పెంచేసేలా ఉన్నారు.