రెజ్లర్లకు మద్దతుగా ఇలియానా షాకింగ్ పోస్ట్.. మోడీ ట్వీట్ ని ఎత్తి చూపిస్తూ..

First Published May 30, 2023, 9:37 PM IST

భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం సంచలనంగా మారింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వారికి మద్దతు లభిస్తోంది.

Image credit: PTI

భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం సంచలనంగా మారింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. బీజేపీ ఎంపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని లైంగికంగా వేధించాడని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు  గత 6 నెలలుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. 

బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించక పోవడంతో రెజ్లర్ల నిరసన మరింత ఎక్కువవుతోంది. దేశం నలువైపుల నుంచి వారికి మద్దతు పెరుగుతోంది. 

సినిమా, తన పర్సనల్ వ్యవరాలు తప్ప సామజిక అంశాల గురించి ఎప్పడూ స్పందించని గోవా బ్యూటీ ఇలియానా తాజాగా రెజ్లర్లకి మద్దతుగా పోస్ట్ పెట్టడం విశేషం. పోలీసులతో సాక్షి మాలిక్ పోరాడుతున్న పిక్ ని ఇలియానా పోస్ట్ చేసింది. సాక్షి మాలిక్ గురించి గతంలో మోడీ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ ని కూడా పెట్టింది. 

సాక్షాత్తు ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించిన మహిళా రెజ్లర్ పరిస్థితి ఇదీ అని అర్థం వచ్చేలా ఇలియానా పోస్ట్ ఉంది. రెజ్లర్లకి మద్దతు తెలిపినందుకు ఇలియానాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వం ఎంతకీ స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ని నేడు గంగా నదిలో పడేయాలని రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

అయితే పతకాలని గంగా నదిలో పడేసేందుకు రెజ్లర్లు సిద్ధంకాగా అక్కడికి వారికి మద్దతుగా చేరుకున్న కొందరు ప్రజా సంఘాల నాయకులు వారించారు. కష్టపడి సొంతం చేసుకున్న మెడల్స్ ని గంగ పాలు చేయవద్దని నచ్చజెప్పారు. ప్రభుత్వానికి ఇంకాస్త టైం ఇచ్చి చూడండి అని చెప్పడంతో రెజ్లర్లు వెనక్కి తగ్గారు. 

గతంలో సాక్షి మాలిక్ రెజ్లర్ గా ఒలంపిక్ మెడల్ సాధించింది. ఆ సమయంలో ప్రధాని మోడీ.. ఆమె తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని ప్రశంసించారు. ఆ ట్వీట్ నే ఇలియానా ఎత్తి చూపిస్తూ పోస్ట్ చేసింది. 

click me!