తోటి ఫిమేల్ కమెడియన్ ని ముద్దుపెట్టుకోబోయిన హైపర్ ఆది... స్టేజి మీదే పట్టుకొని గుండుకొట్టేసారుగా..!

First Published Nov 28, 2022, 5:59 PM IST

బుల్లితెరపై పంచ్ ల వర్షంతో నవ్వులు పూయిస్తున్న స్టార్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)కి చుక్కెదురైంది. తోటీ ఫీమేల్ కమెడియన్ ను కిస్ చేయబోడంతో.. స్టేజీమీదనే గుండు కొట్టించి బుద్ధి చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
 

టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న మరో పాపులర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company). ఈషోలో శ్రీముఖి, యాంకర్ రష్మీ గౌతమ్, రాంప్రసాద్, నరేశ్ తదితరులు తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది ప్రత్యేకంగా నిలుస్తున్నారు. 
 

వేదిక ఏదైనా పంచుల వర్షం కురిపించే హైపర్ ఆదికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ స్టేజీపై అనుకోని ఘటన జరిగింది. ఇటీవల లేడీ యాంకర్లు, జడ్జీలు, తోటీ యాక్ట్రెస్ తో హద్దులు మీరి మరి పంచులు వేస్తూ ఆడియెన్స్ ను నవ్విస్తున్నారు. 
 

ఈ క్రమంలో ఎప్పుడూ నెగ్గుతూనే వస్తున్న హైపర్ ఆదికి తాజాగా పెద్ద దెబ్బే పడింది. విషయం ఏకంగా గుండు గీయించే వరకు వెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. ఎప్పటిలాగే ఈసారి కొత్త టైటిట్ ‘చదివింపులు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 
 

చాలా గ్రాండ్ గా షో స్టార్ అయి.. సాఫీగా నడుస్తోంది. కంటెస్టెంట్లు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. షో మధ్యలో యాంకర్ రష్మీ నెంబర్ టాస్క్ ఇచ్చింది. ఎంపిక చేసుకున్న లక్కీ నెంబర్ వెనకాల వచ్చిన టాస్క్ ను బేషరతుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 

మొదట హైపర్ ఆది లక్కీ నెంబర్ 9 అంటూ ఎంపిక చేసుకోగా.. 30 సెకండ్ల పాటు కిస్ చేయాంటూ టాస్క్ వచ్చింది. దీంతో వెంటనే నటి ఐశ్వర్య వైపు చూస్తూ కిస్ చేయబోయాడు. ఆమె అక్కడి నుంచి పారిపోవడంతో.. నెక్ట్స్ మరో నెంబర్ ను ఎంపిక చేసుకున్నాడు. 

ఆ టాస్క్ లో గుండుకొట్టించుకోవాలనే టాస్క్ వచ్చింది. ఇంద్రజా అడ్డుకుంటున్నా టాస్క్ అంటే టాస్కే అంటూ బుల్లెట్ భాస్కర్, నరేశ్ మిగతా ఆర్టిస్టులు ఆదికి గుండు కొట్టించారు. ఈ విజువల్స్ ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఇంతకీ నిజంగానే గుండు కొట్టించారా? లేదా? అనేది డిసెంబర్ 4న ఆదివారం మధ్యాహ్నా ప్రసారం కానున్న ఫుల్ షోను చూడాల్సిందే.

click me!