శ్రీదేవి డ్రామా కంపెనీలో సెలబ్రేషన్స్.. మరోసారి ‘పుష్ఫ’గా హైపర్ ఆది.. ఆ కన్నీళ్లకు కారణం ఎంటీ?

First Published Jun 30, 2022, 5:07 PM IST

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్న షోస్ లో ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ఈ షోకు మంచి ఆదరణ ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన 75వ ఎపిసోడ్ ప్రోమోను వినోదభరితంగా ఉంది. 
 

తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న టీవీ ప్రొగ్రామ్స్ లో ముందు వరుసలో ఉంది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ షోకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. అత్యధిక వ్యూయర్ షిష్ తో దూసుకుపోతోంది ప్రోగ్రామ్. బుల్లితెర తారలు రష్మీ గౌతమ్, పూర్ణ డాన్స్ లు, ఆకట్టుకునే స్కిట్స్ తో ప్రేక్షకాదరణ పొందింది. ఇతర షోలను ఢీకొట్టేలా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎపిసోడ్స్ ఉంటున్నాయి.
 

అయితే ప్రతి ఎపిసోడ్ లో కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్, ఇమాన్యుయేల్, వర్ష తదితరులు హిలేరియస్ స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈటీవీ ప్లస్ లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారం అవుతుంది. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ షోను నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ 75వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. 75 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా షోలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. షోకు హీరోయిన్ ఇషా చావ్లా హాజరయ్యారు. అలాగే అన్నపూర్ణమ్మ, పూర్ణ, ‘కితకితలు’ హీరోయిన్ గీతా సింగ్ కూడా షోలో సందడి చేశారు.
 

శ్రీదేవి డ్రామా కంపెనీ 75 ఎపిసోడ్ సందర్భంగా హైపర్ ఆది (Hyper Aadi) మరోసారి ‘ఫుష్ఫ’ స్పూఫ్ తో కడుపబ్బా నవ్వించాడు.  గతంలో ఆయన చేసిన ‘పుష్ప’ స్కిట్ మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పుష్ప రాజ్ గా అవతారం ఎత్తడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. అదిరిపోయే పంచులతో లేటెస్ట్ ప్రోమో వినోదభరితంగా ఉంది.
 

ఇదిలా ఉంటే.. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షోనుంచి, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి స్టార్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు.  ఈ  క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ లో ‘చివరికి మిగిలేది’ అంటూ ఓ సస్పెన్స్ ను పెట్టారు. వెంటనే స్టేజ్ పై అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో షోనుంచి ఎవరైనా వెళ్లిపోతున్నారా? అనే సందేహం కలుగుతోంది.
 

అసలు వాళ్ల కన్నీళ్లకు కారణమేంటో తెలియాలంటే తప్పకుండా శ్రీ దేవి డ్రామా కంపెనీ 75వ ఎపిసోడ్ ను చూడాల్సిందే. ఈ ఆదివారం (జూలై 3న) మధ్యాహ్నం ఈటీవీ ప్లస్ లో షో ప్రసారం కానుంది. ఇటీవల టీవీ షోలు ఆడియెన్స్ కు బిగ్ షాక్ లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో అసలు శ్రీ దేవి డ్రామా కంపెనలో ఏమైందన్నది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.

click me!