అల్లు అర్జున్ చూపు ఎప్పుడూ ఆ పాయింట్ దగ్గరే.. ఆ విషయంలో పురాణ పురుషుడు అంటున్న అనసూయ!

First Published May 25, 2021, 6:19 PM IST


అనసూయ కెరీర్ పీక్స్ కి చేరింది. యాంకర్ గా కంటే కూడా నటిగానే ఆమె బిజీ అవుతున్నారు. భాషా బేధం లేకుండా తమిళ,మలయాళ చిత్రాలలో కూడా ఆఫర్స్ దక్కించుకుని దూసుకుపోతుంది హాట్ బ్యూటీ. 
 

జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన అనసూయ, ఆ షో ద్వారా భారీగా ఫాలోయింగ్ రాబట్టింది. పొట్టి బట్టలలో స్కిన్ షో చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల కలల రాణిగా మారిపోయారు. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న అనసూయ ఆ రేంజ్ సాలిడ్ ఫిగర్ మైంటైన్ చేయడమే అద్భుతమే.
undefined
తెలుగులో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనసూయ. వాటిలో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం ఒకటి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.
undefined
కాగా పుష్ప మూవీలో అనసూయ ఓ కీలక రోల్ దక్కించుకున్నారు. సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో రంగమత్తగా చేసి ప్రేక్షకులను మెప్పించిన అనసూయ మరోమారు ఆయనతో పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కాగా ఇప్పటికే పుష్ప షూటింగ్ లో అనసూయ పాల్గొన్నారని సమాచారం.
undefined
పుష్ప సెట్స్ లో అల్లు అర్జున్ డెడికేషన్ చూసిన అనసూయ గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు. భారతంలో అర్జునుడు చెట్టుపైన ఉన్న చిలుక కన్నుపైనే ద్రుష్టి పెడతాడు. అలాగే సెట్స్ లో అల్లు అర్జున్ ద్రుష్టి నటనపైనే ఉంటుంది. పర్ఫెక్షన్, మంచి పెర్ఫార్మన్స్ అనే పాయింట్ పైనే ఆయన చూపు కేంద్రీకృతమై ఉంటుందని అనసూయ అన్నారు.
undefined
ఇక పుష్ప మూవీలో అనసూయ రోల్ ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే పుష్ప థియేటర్స్ లో దిగనుంది.
undefined
పుష్పతో పాటు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడి మూవీలో కూడా ఆమెకు ఓ రోల్ ఉంది.
undefined
click me!