బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైన మిల్కీ బ్యూటీ తమన్నా...  షో ఏమిటో తెలిస్తే నోరు ఊరాల్సిందే!

First Published Jun 15, 2021, 3:21 PM IST

బిగ్ స్క్రీన్ కి ఏమాత్రం తగ్గని ఫేమ్, రెమ్యూనరేషన్ బుల్లితెర మీద కూడా స్టార్స్ అందుకుంటున్నారు. గతంలో పోల్చితే బుల్లితెర మార్కెట్ భారీగా విస్తరించింది. నాగ్, ఎన్టీఆర్, చిరు వంటి స్టార్స్ కూడా బుల్లితెర వ్యాఖ్యాతలుగా మారిన విషయం తెలిసిందే.

మిల్కీ బ్యూటీ తమన్నా సైతం బుల్లితెర ఎంట్రీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా వెండితెరపై వెలుగుతున్నారు తమన్నా.
undefined
టాలీవుడ్ లో అందరు టాప్ స్టార్స్ తో కలిసి నటించిన ఆమె బాహుబలి లాంటి ఎపిక్ మూవీలో హీరోయిన్ గా చేశారు.  హిందీలో కూడా చిత్రాలు చేసినా తమన్నా తెలుగు, తమిళ బాషలలో ఎక్కువగా చిత్రాలు చేశారు.
undefined
ఇక కాలానికి అనుగుణంగా మారుతూ డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు.  తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిజిటల్ సిరీస్ లు లెవెన్త్ హవర్, నవంబర్ స్టోరీ విడుదల కావడం జరిగింది. నవంబర్ స్టోరీ మంచి ఆదరణ అందుకోగా, తమన్నా నటనకు ప్రశంసలు దక్కాయి.
undefined
కాగా బుల్లితెర ఎంట్రీకి కూడా తమన్నా సిద్ధం అయ్యారట. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయట . ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంకి తమన్నా జడ్జిగా వ్యవహరించనున్నారట.
undefined
తమన్నా బుల్లితెర ఎంట్రీతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమాల కోసం ఎదురు చూడకుండా, ప్రతివారం తమన్నా గ్లామర్ చూసి మురిసిపోవచ్చు.
undefined
మరోవైపు తమన్నా తెలుగులో ఎఫ్3, సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో నటిస్తున్నారు. తమన్నా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది తమన్నా.
undefined
click me!