తేజా అని ఆఫీస్ కి వెళితే, ఆయన చేసిన మోసం తరువాత అర్థమైంది...రాశి సంచలన వ్యాఖ్యలు

First Published Dec 1, 2020, 5:45 PM IST

90లలో హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపుఊపింది హీరోయిన్ రాశి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీలో కూడా ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం. ఐతే దర్శకుడు తేజ తనను మోసం చేసిన విషయాన్ని తాజాగా బయటపెట్టారు రాశి.

చిత్రం, నువ్వు నేను, జయం వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరో హోదా అందుకున్న దర్శకుడు తేజాకు మహేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నిజం మూవీ మహేష్ చేయడం జరిగింది. మహేష్ ఇమేజ్ కి ఆ స్టోరీ సెట్ కాకపోవడం వలన, అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
నిజం మూవీలోఅప్పటి దాకా హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కలిగిన రాశి, విలన్ కీప్ గా బోల్డ్ రోల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పాత్ర రాశి చేయడం అప్పుడు నిజంగా సంచలనమే. కాకపోతే అప్పటికే ఫేడ్ అవుటైన రాశి, ఇష్టపడే ఆ పాత్ర చేసి ఉండవచ్చని అందరూ భావించారు.
undefined
కానీ దర్శకుడు చెప్పిన కథ వేరు, తరువాత తెరకెక్కించింది వేరని రాశి అప్పుడు జరిగిన సంఘటనలు బయటపెట్టారు. రాశి మాట్లాడుతూ...నిజానికి నేను ఎవరి ఆఫీస్ కి వెళ్ళను. దర్శకుడు తేజా కావడంతో ఫోన్ చేస్తే, ఆయన ఆఫీస్ కి వెళ్ళాను' అన్నారు
undefined
మహేష్ బాబు హీరో, గోపి చంద్, నువ్వు లవర్స్, మధ్యలో విలన్ వస్తాడు. సినిమా మొత్తం మీ లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పాడట తేజా. తీరా షూటింగ్ సెట్ కి వెళితే తేజా చెప్పిన దానికి, అసలు కథలు సంబంధం లేదని అరమైందట.
undefined
అందుకే సినిమా నుండి తప్పుకుంటానని, తన మేనేజర్ తో రాశి అన్నారట. ఒప్పుకున్న తరువాత మూవీ నుండి తప్పుకుంటే పరిశ్రమలో చెడ్డ పేరు వస్తుంది. ఈ సారికి ఎలాగొలా చేసేయండని, చెప్పడంతో తప్పక ఆ పాత్ర చేశారట. ఆ పాత్ర చేయకుండా ఉండాల్సిందని, రాశి అన్నారు.
undefined
నిజం మూవీలో రాశి చేసిన ఆ పాత్రకు భిన్నాభిప్రాయాలు వచ్చాయట. కొందరు బాగా చేశావ్ అంటే, మరి కొందరు విమర్శించారట. నాగబాబు మాత్రం ఫోన్ చేసి నీ పాత్ర నెగెటివ్ అయినా, నువ్వు కత్తిలా ఉన్నావ్ అని పొగిడారట.
undefined
ఇక రంగస్థలం మూవీలో అనసూయ చేసిన రంగమత్త పాత్ర కోసం మొదట రాశిని సంప్రదించారట. మోకాళ్ళ పై వరకు చీర కట్టాల్సి వస్తుందని, చేయనని తప్పుకున్నారట రాశి.
undefined
2017లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ లంక మూవీలో చివరిసారిగా రాశి కనిపించారు. ఆ చిత్రానికి నిర్మాత కూడా రాశినే కావడం విశేషం.
undefined
click me!