ఏఎన్నార్, ఇర్ఫాన్‌ ఖాన్‌, సుశాంత్‌.. వీళ్లు చివరి చిత్రాల్లో ఒకేలా!

First Published Jun 16, 2020, 2:26 PM IST

యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి యావత్‌ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఈ సందర్భంగా పలువురు అభిమానులు గతంలో మరణించిన సినీ ప్రముఖులకు సుశాంత్ కు మధ్య పోలికలను గుర్తు చేసుకుంటున్నారు.

కాకతాలీయమే అయిన కొన్ని పోలికలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే ఈ పోలిక కూడా ఈ నలుగురు నటులుగా ఎంతో గొప్ప పేరు సాధించారు. అంతే కాదు ఒక్క ఏఎన్నార్‌ తప్ప మిగిలిన నలుగురు చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు. ఈ నలుగురు తమ ఆఖరి చిత్రాల్లో ఒక తరహా సన్నివేశంలో నటించటం విశేషం.
undefined
అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి చిత్రం మనం. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయనకు క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లో మరణిస్తానని తెలిసినా ఆయన సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఆయన కారులోంచి బయటకు చూస్తూ కనిపించాడు.
undefined
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన చివరి చిత్రం అంగ్రేజీ మీడియం. ఈ సినిమాలో ఇర్ఫాన్ కూడా ఓ సన్నివేశంలో కార్‌ విండో లోంచి బయటకు చూస్తున్నట్టుగా కనిపించాడు.
undefined
హాలీవుడ్‌ సినిమా డార్క్‌ నైట్‌ సినిమాలో జోకర్‌ పాత్రలో కనిపించిన నటుడు హీత్ లెడ్జర్‌. ఈ నటుడు కూడా చివరి చిత్రలో కారు విండో లోంచి బయటకు చూస్తున్న సన్నివేశం ఉంది.
undefined
ఇక ఆదివారం మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కూడా తన చివరి చిత్రంలో అలాంటి సన్నివేశంలోనే కనిపించాడు. చిచోరే సినిమాలో కార్‌ విండో నుంచి బయటకు చూస్తూ క్యూట్‌ స్మైల్ ఇస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది.
undefined
click me!