‘ప్రాజెక్ట్ కే’పై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. త్వరలోనే అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

First Published Dec 26, 2022, 1:37 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కే’. దర్శకుడు నాగ్ అశ్విన్ నెక్ట్స్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై తాజాగా లేడీ ప్రొడ్యూసర్ స్వప్నా దత్ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు.
 

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, రాజా డీలక్స్ సినిమాలు మొత్తం వేల కోట్ల పెట్టుబడులతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో పాన్ వరల్డ్ స్థాయిలో Projec Kను నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.550 కోట్లతో తెరకెక్కిస్తున్నారు నిర్మాత అశ్వనీ దత్. మరోవైపు ఆయన కూతురు స్వప్నా దత్ కూడా బ్యూటీఫుల్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ఫీమేల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతోంది. 
 

రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సీతారామం’తో భారీ విజయాన్ని అందుకున్నారు స్వప్నా దత్. ఈ సందర్భంగా అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా అంచనాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ Kపై గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు. 
 

ఈ మేరకు ట్వీటర్ ద్వారా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు. ‘ప్రాజెక్ట్ కే’పై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. త్వరలోనే నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్ అందించబోతున్నారు. మైండ్ బ్లోయింగ్ అప్డేట్ రాబోతోంది. సెట్స్ లో ప్రభాస్ అందరినీ బాగా చూసుకుంటున్నారు. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో వచ్చే అప్డేట్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన పోస్టర్లకే ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ అప్డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఏదైనా వచ్చే అవకాశం ఉందేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యాధునిక టెక్నాలజీ, గ్రేట్  VFXతో రూపొందిస్తున్నారు. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) తొలిసారిగా ప్రభాస్ సరసన నటించబోతోంది.  యంగ్ బ్యూటీ దిశా పటాని కూడా సెంకడ్ లీడ్ లో అలరించబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు షెడ్యూల్ చేస్తున్నారు. చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు.

click me!