తెలుగు తేజం పీవీ సింధు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి. ఒలంపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన ఏకైక క్రీడాకారిణి పివి సింధు. 2016 రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు.. ఇటీవల టోక్యో ఒలంపిక్స్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించింది.
వరుస ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించడం ఇండియా నుంచి కేవలం పివి సింధూకే సాధ్యం అయింది. తన అసాధారణ ప్రతిభతో సింధు బ్యాట్మింటన్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సింధు మన తెలుగు వనిత కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున మెగాస్టార్ చిరంజీవి ఆమెని తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో పార్టీ కూడా అరేంజ్ చేశారు చిరంజీవి.
చిరు నివాసంలో జరిగిన సింధు సత్కారం, పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లూ కలర్ డిజైనర్ డ్రెస్ లో సింధు వెలిగిపోతోంది. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల తారలు రాధిక, సుహాసిని హాజరయ్యారు. అలాగే కింగ్ నాగార్జున, రానా దగ్గుబాటి కూడా పాల్గొన్నారు.
వీరితో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ రాంచరణ్, ఉపాసన దంపతులు.. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ హాజరయ్యారు.
దేశం గర్వించేలా వరుసగా రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించిన పివి సింధుని సత్కరించుకోవడం సంతోషాన్ని ఇచ్చింది అని సింధు పేర్కొంది.
ఈ సత్కార కార్యక్రమంలో పివి సింధు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య చిరునవ్వులు వెల్లివిరిశాయి. రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.