చిరు రాజమండ్రి టూర్, అభిమానుల కోలాహలం... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Feb 21, 2021, 1:31 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి తళుక్కున మెరిశారు. ఆచార్య షూటింగ్ కోసం చిరంజీవి రాజమండ్రి మధురవాడ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు . చిరంజీవి రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడకు చేరుకొని సందడి చేశారు. 
 

ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వచ్చిన చిరంజీవిని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. చిరు నినాదాలు చేస్తూ, జెండాలు ప్రదర్శిస్తూ తమ అభిమానం చాటుకున్నారు.
undefined
అభిమానుల ఉత్సహాం తీర్చడం కోసం కారు పైనుండి చిరంజీవి అభివాదం చేశారు. అందరి వైపు ఆయన పలకరింపుగా చూశారు.
undefined
చిరంజీవిని చూసిన ఆనందంలో అభిమానులు తమ కెమెరాలకు పని చెప్పారు. ఆ అరుదైన క్షణాలను తమ కెమెరాలలో బంధిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
undefined
అభిమానులతో కాసేపు గడిపిన చిరంజీవి అక్కడి నుండి బయలుదేరి ఆచార్య షూటింగ్ సెట్స్ కి వెళ్లారు.  గోదావరి ప్రాంతంలో గల ఏజెన్సీ ఏరియాలో ఆచార్య షూటింగ్ జరుగుతుందని సమాచారం.
undefined
కొద్దిరోజుల క్రితమే రామ్ చరణ్ అక్కడికి చేరుకోవడంతో పాటు షూటింగ్ లో పాల్గొంటున్నారు.  తాజాగా చిరంజీవి ఆచార్య షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లడం జరిగింది. దర్శకుడు శివ కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరు మరియు చరణ్ కలిసి నటిస్తున్నారు.
undefined
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సోనూ సూద్ కీలక రోల్ చేస్తున్నారు. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందించడం విశేషం.
undefined
click me!