Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Published : Jul 01, 2026, 01:45 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ.. నమ్రతను చూస్తే భయమేస్తోందని అంటోంది ఓ హీరోయిన్. తేడా వస్తే తనకు సమాధి కడుతుందని భయపడుతున్న తార ఎవరో తెలుసా? 

PREV
16
50 ఏళ్ళు వచ్చినా తగ్గని మహేష్ బాబు క్రేజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా మహేష్ లాంటి భర్త కావాలని చాలామంది లేడీస్ కోరుకుంటుంటారు. కొంత మంది ఈ విషయాన్ని భహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్లలో కూడా ఎంతో మంది మహేష్ బాబు గ్లామర్ కు పడిపోయిన వారు ఉన్నారు. 50 ఏళ్లు వచ్చినా.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా కాపాడుకుంటున్నాడు మహేష్. 

ఇక బాలీవుడ్ హీరోయిన్లు కూడా మీకు టాలీవుడ్ లో ఎవరంటే ఇష్టం అంటే టక్కున మహేష్ బాబు పేరు చెపుతుంటారు. సూపర్ స్టార్ గ్లామర్ లోనే కాదు క్వాలిటీస్ లో కూడా నెంబర్ వన్ అని నిరూపించాడు. పక్కా ఫ్యామిలీ మెన్ కావడంతో.. ఆయనకు హస్పెండ్ మెటీరియల్ అన్న పేరు కూడా వచ్చింది. హీరోయిన్లు చాలామంది మీకు ఎటువంటి భర్త కావాలి అని అడిగితే.. మహేష్ బాబు లాంటి భర్త కావాలని చెప్పిన సదర్భాలు కూడా ఉన్నాయి.

26
నెంబర్ వన్ కపుల్ గా మహేష్ - నమ్రత

అయితే ఆ లక్కీ ఛాన్స్ సూపర్ స్టార్ తో ఒకే ఒక్క సినిమా చేసిన నమ్రత కొట్టేసింది. మహేష్ బాబును పెళ్లాడి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఈ ఇద్దరు టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబును పెళ్లాడాలని చాలామంది హీరోయిన్లకు ఉంటుంది. ఒక టాలీవుడ్ హీరోయిన్ అయితే ఈ విషయాన్ని డైరెక్ట్ గానే ఒప్పుకుంది. కానీ నమ్రత విషయంలోనే తనకు భయమేస్తుందని ఆమె వెల్లడించింది. మహేష్ ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన చేస్తేనే నమ్రత నాకు సమాధి కట్టేస్తుందంటూ భయపడుతోంది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు ఛార్మీ కౌర్.

36
మహేష్ ను పెళ్లి చేసుకుంటావా అని ఆఫర్..

గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో ఛార్మీకి ఈ ప్రశ్న ఎదురయ్యింది. మహేష్ బాబును సూపర్ స్టార్ చేయడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాత్ర చాలా ఉంది. ఆయన చేసిన పోకిరి సినిమా వల్లే ఇండస్ట్రీ హిట్ కొట్టి మహేష్ బాబు మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే బిజినెస్ మెన్ సినిమాతో మరోసారి మహేష్ ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించాడు పూరి.

46
నమ్రత ముందే అడిగేసిన పూరీ జగన్నాథ్

ఈ సినిమాకు సబంధించిన ఈవెంట్ లో సూపర్ స్టార్ , ఆయన భార్య నమ్రత, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మీ కౌర్ కూడా పాల్గొంది. అప్పుడే సరదాగా ఛార్మీని పూరి ఈ ప్రశ్న వేశాడు. ఇప్పటికిప్పుడు మహేష్ బాబును పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఏం చేస్తావ్ .. ముంబయ్ లో చేసుకుంటావా, హైదరాబాద్ లో చేసుకుంటావా అని ఛార్మీని అడిగాడు.

56
నమ్రత చంపేస్తుందని వణికిపోయిన హీరోయిన్..

పూరీ జగన్నాథ్ అడిగి ప్రశ్నకు దిల్ ఖుష్ అయ్యింది ఛార్మీ. ఆమె మాట్లాడుతూ..'' మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలని అని ఎవరికి ఉండదు. కానీ మహేష్ ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన నాలో ఉందని తెలిస్తే చాలు.. నమ్రత నన్ను చంపి సమాధి కడుతుంది. అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే.. నా సమాధిని నమ్రత హైదరాబాద్ లో కడుతుందా.. లేక ముంబయ్ లో కడుతుందా అని అడగాలి'' అని ఛార్మీ నవ్వుతు బదులిచ్చారు. ఛార్మీ కామెంట్స్ కు మహేష్, నమ్రతతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

66
నిర్మాతగా రాణిస్తోన్న ఛార్మీ కౌర్..

హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తింది ఛార్మీ కౌర్. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. సినిమాలు నిర్మిస్తోంది. వీరి కాంబోలో వచ్చిన లైగర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సినిమాలు ప్లాప్ అవుతున్నా.. ప్రయత్నం మాత్రం మానడం లేదు ఛార్మీ. ప్రస్తుతం పూరీతో కలిసి తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories