Boney Kapoor Remembers Sridevi : శ్రీదేవిని గుర్తు చేసుకున్న బోనీ కపూర్..ఎమోషనల్ పోస్ట్

First Published Jan 19, 2022, 9:15 AM IST

బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్(Boney Kapoor) తన భార్య.. దివంగత నటి శ్రీదేవి(Sridevi )ని గుర్తు చేసుకున్నారు. తన తో తీపి గురుతులను గుర్తు చేసుకున్నారు. తన ప్రేమకు గుర్తుగా నిలిచిన పాత ఫోటోను పంచుకున్నారు.

తన భార్య దివంగత శ్రీదేవి కి సంబంధించిన ఓ మధుర జ్ణాపకాన్ని పంచుకున్నారు బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్.  2012 లో దుర్గు గుడిలో పూజ సందర్భంగతా తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో శ్రీదేవి చక్కగా చీరకట్టులో కనిపించింది.  వెనుక వీపు మీద బోనీ అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది. చిరునవ్వులు చిందిస్తూ శ్రీదేవి దేవతలా ఆమె మెరిసిపోతోంది.  ఈ ఫోటోను ఇన్ స్టాలో పంచుకున్నారు బోనీ కపూర్.

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హీరోయిన్ శ్రీదేవి(Sridevi)మకుటం లేని మహారాణి. ఆమె మరణించినా.. ఆమె సంపాధించుకున్న కీర్తి ఇప్పటికీ ఆమెను జన హృదయాలలో నిలిపిందీ. ఇక ఆమె కుటుంబం గురించి అందరికి తెలిసిందే. శ్రీదేవి భర్త బోనీ కపూర్(Boney Kapoor).. ఎప్పుడూ ఆమెను ఎక్కువగా ప్రేమిస్తూ.. ఆరాధించిన వ్యక్తి. శ్రీదేవి మరణం తరువాత చాలా క్రుంగిపోయారు బోనీకపూర్.. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండిపోయారు.

శ్రీదేవి(Sridevi) మరణించి నాలుగేళ్లు కావస్తున్నా.. ఆమెను మర్చిపోలేకున్నారు బోనీ కపూర్(Boney Kapoor). లాస్ట్ ఇయర్ ఇన్ స్టా లో అకౌంట్ ఓపెన్ చేసిన బోనీ.. అందులో తన కుటుంబ వివరాలను అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. ప్రతీ సారి ఓ విలువైన ఫోటోను పోస్ట్ చేస్తారు బోణీ.

చీరకట్టులో ఉన్న శ్రీదేవి(Sridevi)  ఫోటో పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. రూప్ కి రాణీ అంటూ కొందరు.. ఆమె మరణాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ.. శ్రీదేవి(Sridevi) పై ఉన్న చెరగని.. తరగని ప్రేమ మమకారాన్ని కామెంట్ల రూపంలో బయట పెడుతున్నారు

సౌత్ లో స్టార్ డమ్ వచ్చిన తరువాత బాలీవుడ్ లో కూడా తన హవా చూపించారు శ్రీదేవి(Sridevi). అతిలోక సుందరి అన్న బిరుదు సాధించిన అందాలనటి ఆమె ఒక్కత్తే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీదేవి.. ఇద్దరు ఆడపిల్లలు భర్తతో కలిసి ముంబయ్ లో హ్యాపీగా ఉండేది. కాని 2018 లో ఆమె మరణం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

శ్రీదేవి(Sridevi) మరణం వారి కుటంబానికే కాదు.. ఆమెను ఆరాధించే అభిమానులకు కూడా తీరని వేధన కలిగించింది. ఇక శ్రీదేవి మరణం తరువాత ఆమె వారసురాలిగా పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రెండు మూడు సినిమాలతోనే స్టార్ డమ్ సంపాధించి. తల్లికి తగ్గ కూతురుగా నిరూపించుకున్నారు. చిన్నకూతురు ఖుషీ కపూర్ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. ఖుషీని కూడా ఇంటర్డ్యూస్ చేయాలని చూస్తున్నారు.

click me!