దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
undefined
బాలీవుడ్ సీనియర్ రేఖ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేశారు.
undefined
భోజ్పూర్ సూపర్స్టార్, గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ గుర్గావ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
undefined
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన భార్యతో కలిసి విలే పర్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
undefined
సినీనటి, నార్త్ ముంబై కాంగ్రెస్ అభ్యర్ధి ఊర్మిళ మటోండ్కర్ బాంద్రాలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
undefined
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ భార్య కిరణ్ రావ్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో వారు ఓటు వేశారు.
undefined
బాలీవుడ్ నటుడు భాగ్యశ్రీ, సోనాలి బింద్రేలు పర్లీలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
undefined
ప్రముఖ నటుడు సంజయ్ దత్ సోదరి, దత్ ముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రియా దత్ బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
undefined
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై ఖర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
undefined
ఫిలిం మేకర్ మాధుర్ భండార్కర్ తన భార్యతో కలిసి బాంద్రాలో ఎంఎంకే కాలేజ్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
undefined
బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
undefined
బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
undefined
నటి హేమామాలిని ఆమె ఇద్దరు కూతుర్లు ఈశా డియోల్, అహానా డియోల్ ముంబైలోని పర్లీలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
undefined