అయితే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ స్టామినాని వాడుకునే దర్శకుడు కనిపించడం లేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బోల్తా కొట్టాయి. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ఆదిపురుష్ చిత్రంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో అంచనాలన్నీ తారుమారు చేశాడు ఓం రౌత్. చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ తో బడ్జెట్ గేమ్స్ ఆడుతున్నారు తప్పితే.. నిఖార్సైన సినిమా తీయడం ఎవరి వల్లా కావడం లేదు.