బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5) సక్సెస్ ఫుల్ గా పది వారాలు, 71 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నేడు ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు. చిల్డ్రన్స్ డే (Childrens day)నేపథ్యంలో ఆ తరహా గేమ్స్ నిర్వహించి, స్కూల్ పిల్లలకు విధించే శిక్షలు విధించారు.
మొదటగా మూడు పెద్ద బాక్సులు నేలపై మార్క్ చేసి... ఫైర్, ఐస్, వాటర్ అని విభజించారు. కంటెస్టెంట్స్ నాగార్జున (Nagaruna) చెప్పిన వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, ఆయన ఆదేశం ప్రకారం ఆ మూడింటిలో సరైన బాక్స్ లో నిల్చోవాలని, చివరిగా బాక్స్ లోకి వెళ్ళినవారు, ఎలిమినేట్ కావడంతో పాటు నాగార్జున విధించిన శిక్ష అనుభవించాలి అన్నారు.
ఈ గేమ్ లో మొదటిగా శ్రీరామ్ ఎలిమినేట్ కాగా నోటిపై వేలు పెట్టుకోవాలి అని శిక్ష వేశాడు. ఆ తర్వాత ప్రియాంకను బెంచి పై నిల్చోవాలని, రవిని గోడ కుర్చీ వేయాలని, షణ్ముఖ్ మోకాళ్లపై నిల్చోవాలని, సిరిని ఒంటికాలిపైన నిల్చోవాలని చెప్పి వాళ్లకు శిక్షలు వేశాడు. ఈ గేమ్ లో చివరి వరకు ఉండి, సన్నీ విజేతగా నిలిచాడు.
అనంతరం కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విభజించి... టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు చూసి గుర్తు పట్టాలనే గేమ్ ఆడించారు. కాజల్, కీర్తి సురేష్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోలు ప్రదర్శించగా.. హీరోలను ఈజీగా గుర్తుపట్టిన కంటెస్టెంట్స్, హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది పడ్డారు
ఆ తరువాత ఇంట్లో వాళ్లపై తమ అభిప్రాయం ఏమిటో మెడలో ట్యాగ్ వేసి చెప్పాలని నాగార్జున ఆదేశించారు. ఈ గేమ్ లో సన్నీ.. రవి మెడలో ఫేక్ అనే ట్యాగ్ వేశాడు. మానస్ ప్రియాంక మెడలో భరించలేను అనే ట్యాగ్ వేశాడు. రవి అని మాస్టర్ మెడలో ఆరగెంట్ అనే ట్యాగ్, కాజల్ సిరి మెడలో టు ఫేసెస్ అనే ట్యాగ్స్ వేయడం జరిగింది.
ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే... నిన్న సన్నీ సేవ్ కాగా కాజల్, సిరి, రవి, మానస్ ఎలిమినేషన్స్ లో మిగిలారు. వీరిలో మొదటగా సిరి (Siri) సేవ్ కావడం జరిగింది. అనంతరం రవి సేవ్ అయ్యాడు. చివరిగా కాజల్, మానస్ మిగిలారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన రెండు బాక్స్ లలో ఇద్దరూ చేతులు ఉంచాలని, ఎవరి చేతికి రెడ్ కలర్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్, పసుపు రంగు ఉన్నవాళ్లు సేఫ్ అని చెప్పాడు. బాక్స్ లనుండి చేతులు తీయగా ఇద్దరికీ పసుపు రంగు అంటి ఉంది. దీనితో నాగార్జున అసలు విషయం చెప్పాడు.
అనారోగ్యం కారణంగా వారం రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉంటున్న జెస్సీ (Jessy)ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. మందులకు జెస్సీ ఆరోగ్యం కుదుటపడలేదని, డాక్టర్స్ మరికొన్ని పరీక్షలు సూచించారని నాగార్జున తెలిపారు. ఎలిమినేటైన జెస్సి హోస్ట్ నాగార్జున వున్న వేదికపైకి వెళ్ళాడు.